Refrigerator blast: తమిళనాడులో మదురైలోని ఓ లేడీస్ హాస్టల్లో ఫ్రిజ్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు. పలువురికి గాయాలైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఒక గదిలో ఎలక్ట్రానిక్ పరికరం పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మదురైలోని కాట్రపాళయంలో ఈ హాస్టల్ ఉంది, ఇక్కడ అనేక మంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటున్నారు.
Fridge Explodes in Women’s Hostel in Madurai: తమిళనాడులోని మదురైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మదురై జిల్లా కాట్రంపళయం ప్రాంతంలోని విసాక ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో ఈరోజు తెల్లవారుజాము 4:30 గంటల సమయంలో ఫ్రిడ్జ్ పేలింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రిఫ్రిజిరేటర్ దగ్గర నిద్రిస్తున్న ఇద్దరు యువతులు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. Also…
చిన్న పిల్లలు నూడుల్స్ అనగానే లొట్టలేసుకుంటారు. అంతగా వాళ్లు దాన్ని ఇష్టపడి తింటారు. పైగా క్షణాల్లో తయారు కావడం.. తక్కువ ధరలోనే దొరకడంతో పిల్లలు నూడుల్స్కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అదే ఆ బాలిక పాలిట శాపమైంది. స్కూల్ నుంచి రాగానే.. ఆకలి తీర్చుకునేందుకు నూడుల్స్ రెడీ చేసుకుని తింది.. తిన్న కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు విడిచింది.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే దేశమంతా ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. న్యాయం కోసం వైద్యులు, నర్సులు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. రెండు వారాల నుంచి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి.
Menstrual Cramps: రుతుక్రమ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ యువతి ట్యాబ్లెట్లు వేసుకోవడం ఆమె ప్రాణాలను తీసింది. ఈ ఘటన తమిళనాడు లోని తిరుచ్చి జిల్లాలో జరిగింది. ముసిరి తాలూకా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి రుతుక్రమంలో నొప్పి నివారణకు మెడిసిన్స్ తీసుకుంది. తీవ్రమైన కడుపు నొప్పిని తగ్గించే ప్రయత్నంలో ఎక్కువ ట్యాబ్లెట్లను వేసుకుంది. ఇది ఆమె ప్రాణాలనపు తీసింది. ఈ విషాద ఘటన ఆగస్టు 21న తిరుచ్చిలోని పులివలం ప్రాంతంలో…
Physical Assaults: తమిళనాడు రాష్ట్రంలో నాగర్ కోయిల్లోని కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Sri Lankan Navy: తమిళనాడులోని ఫిషింగ్ ఓడరేవును వదిలి శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేట కొనసాగిస్తున్న ఎనిమిది మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది.
తమిళనాడులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. చెయ్యార్ పట్టణం సమీపంలో చెన్నైకి వెళ్తున్న వ్యాన్, బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయింది. కాగా.. ఈ ప్రమాదం జరగ్గానే ఇద్దరు ప్రయాణికులు కొద్దిసేపు గాల్లోనే ఉండి కిందపడ్డారు.
తమిళనాడు కృష్ణగిరిలోని ఓ పాఠశాలలో నకిలీ ఎన్సీసీ క్యాంపులో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు శివరామన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్కు ముందు విషం తాగినట్లు చెప్పారు.
POSCO Case: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 9 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. నివేదిక ప్రకారం , బాలలపై లైంగిక వేధింపులు & బాల్య వివాహాలపై అవగాహన సెషన్ నిర్వహించడానికి చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) సిరుముగై ప్రాంతంలో ఉన్న పాఠశాలకు వచ్చినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.…