Tamil Nadu Governor: ‘‘సెక్యులరిజం’’తో భారత్కి ఏం సంబంధం.. గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం..
- తమిళనాడు గవర్నర్ వ్యాఖ్యలపై రాజకీయ రగడ..
- సెక్యులరిజం యూరప్ భావన.. భారత్లో స్థానం లేదు..
- ఆర్ఎన్ రవి వ్యాఖ్యలపై తమిళ పార్టీలు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఆయన చేసిన ‘‘లౌకికవాదం(సెక్యులరిజం)’’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమైంది. ‘‘సెక్యులరిజం అనేది యూరప్ భావన, భారతదేశంలో దానికి స్థానం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ దేశ ప్రజలపై చాలా మోసాలు జరిగాయి. వాటిలో ఒకటి లౌకికవాదం. దీనికి తప్పుడు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. సెక్యులరిజం అంటే ఏమిటి..? సెక్యులరిజం అనేది యూరోపియన్ భావిన. ఇది భారతీయ భావన కాదు.’’ అని కన్యాకుమారిలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో రవి అన్నారు.
Read Also: Badlapur encounter: బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్కౌంటర్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిన అంశం..
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
చర్చి, రాజు మధ్య పోరాటం ఫలితంగా లౌకికవాదం వచ్చిందని, భారతదేశం ధర్మానికి ఎలా దూరంగా ఉంటుంది..? అని, సెక్యులరిజం అనే యూరోపియన్ భావనని అక్కడే ఉండనివ్వడం, భారతదేశానికి సెక్యలరిజం అవసరం లేదని తమిళనాడు గవర్నర్ అన్నారు. 1976లో 42వ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో “సెక్యులర్” అనే పదాన్ని చేర్చారు.
అయితే, గవర్నర్ వ్యాఖ్యల్ని రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. రాజ్యాంగం కూడా విదేశీ భావన అని ఆయన భవిష్యత్తులో చెప్పవచ్చని ప్రతిపక్షాలు విమర్శించాయి. సీపీఎం నేత బృందా కారత్ మాట్లాడుతూ.. లౌకికవాదం లేదా రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయడం భారత రాజ్యాంగంలో కీలకమని అన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ భావన అని, అలాంటి గవర్నర్ని నియమించడం సిగ్గు చేటని ఆమె అన్నారు. సిపిఐ నాయకుడు డి రాజా గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మరియు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కూడా “ధర్మపరిపాలన భావనను” తిరస్కరించారని అన్నారు. ఫెడరలిజం, ఒక వ్యక్తి ఒకే ఓటు, ప్రజాస్వామ్య అనేవి కూడా యూరప్ నుంచే ఉద్భవించాయనే లాజిక్ని గవర్నర్ మరిచారా..? అని కాంగ్రెస్ నేత పి. చిదంబరం ప్రశ్నించారు. సెక్యులరిజం అనేది భారతదేశానికి అత్యంత అవసరమైన భావన, ఐరోపాది కాదని, రాజ్యాంగాన్ని పూర్తిగా చదవాలని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు.
తాజావార్తలు
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్డ్రాప్లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!