Tamil nadu: ఐదుగురు కుటుంబ సభ్యులతో వ్యాపారవేత్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే..!
- తమిళనాడులో ఘోర విషాదం
- ఐదుగురు కుటుంబ సభ్యులతో వ్యాపారవేత్త ఆత్మహత్య
- సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యాపారవేత్త కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఓ పాడుబడిన కారులో మృతదేహాలు లభించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్
Also Read
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
మణికందన్ (50) అనే వ్యాపారవేత్త.. భార్య నిత్య, తల్లి సరోజ, ఇద్దరు పిల్లలతో సేలంలో నివాసం ఉంటున్నాడు. మణికందన్ మెటల్ వ్యాపారం చేస్తున్నాడు. ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ.. కుటుంబమంతా తీవ్రమైన నిర్ణయం తీసుకుని ప్రాణాలు వదిలారు. తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలు పాడుబడిన కారులో కనిపించాయని పోలీసులు తెలిపారు. తిరుచ్చి-కరైకుడి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం కారు ఆగి ఉంది. రెండు రోజుల నుంచి కారు ఆగి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకుని డెడ్బాడీలను పరిశీలించారు. బాధితులు విషం సేవించి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇది కూడా చదవండి: Devara: నైట్ ఒంటి గంటకు 500 షోలు.. మెంటలెక్కిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్
ఇక కారులోంచి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణికందన్.. మెటల్ వ్యాపారం చేస్తూ అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్లే ఆత్మహత్యకు పురికొల్పి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సేలం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఐదుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంత దూరం వచ్చి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ram Charan: ‘దేవర’కి చరణ్ విషెష్
తాజావార్తలు
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!