Rajastan: పెళ్లి రోజే వధువు జంప్..13రోజులు పెళ్లి బట్టల్లో మండపంలోనే ఎదురుచూసిన వరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajastan: ఇటీవలి కాలంలో పెళ్లి పీటల మీద నుంచి నూతన వధువరులు పారిపోవడం ట్రెండ్ అయింది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తల్లో వింటున్నాం. అలాంటి ఘటనే మరొకటి రాజస్థాన్లో వెలుగు చూసింది. అది కూడా.. పెళ్లి కూతురు కోసం.. వరుడు 13 రోజులపాటు పెళ్లి బట్టల్లోనే వస్తుందని ఎదురు చూశాడు. వివరాలలోకి వెళితే..రాజస్థాన్లోని పాలీ జిల్లాలో ఇది జరిగింది. అక్కడ సౌనా గ్రామానికి చెందిన సకారం అనే వ్యక్తి కూతురైన మనీషాకు వారి దగ్గర బంధువైన శ్రవణ్ కుమార్ తో పెళ్లి నిశ్చయించారు. వరుడి తరపు వారంతా వధువు గ్రామానికి వెళ్లారు. పెళ్లికూతురు తరపు వారు వారికి ఘనంగా స్వాగతం పలికారు. మే 4న ఉదయం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి తంతు మొదలైంది. పెళ్లి కుమార్తెను తీసుకురావాలంటూ పురోహితుడు తెలిపాడు.
Read Also:Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు నాయకుడు కాదు మానిప్యులేటర్.. సజ్జల సీరియస్ కామెంట్స్
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఈలోగా వధువు రావడానికి కొంచెం టైం పడుతుందంటూ పెళ్లి కుమార్తె తరపు వారు అతనికి తెలిపారు. అయితే, మనీషా తనకు విపరీతమైన కడుపునొప్పి వస్తుందని చెప్పి ఆ సమయానికి ఇంటి వెనుకకు వెళ్లింది. అక్కడ తనకోసం అప్పటికే వేచి ఉన్న బంధువుతో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. కూతురు ఎంతసేపైనా రాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులంతా వెతికారు. కానీ, ఆమె జాడ కనిపెట్టలేకపోయారు. దీని మీద పెళ్లి కుమార్తె తండ్రి మాట్లాడుతూ.. నెమ్మదిగా తన కూతురు మేనమామ కొడుకు అయిన భరత్ కుమార్ తో వెళ్లిపోయిందని చెప్పాడు. ఎలాగో ఆమె ఆచూకీ కనిపెట్టిన బంధువులు ఆమెకు ఎంత చెప్పినా ఈ పెళ్లికి ఆమె ససేమిరా అంది.
Read Also:King of Kotha: ఈ ఓనమ్ కి బాక్సాఫీస్ ని కబ్జా చేయనున్న దుల్కర్
తర్వాత ఇంటికి తిరిగి వచ్చినా కూడా పెళ్లి చేసుకోనని మొండికేసి కూర్చుంది. ఇక మరోవైపు.. ఆమెనే చేసుకుంటానని పట్టుబట్టిన వరుడు పెళ్లి బట్టల్లోనే మండపంలో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఇలా ఏకంగా 13 రోజుల వరకు.. పెళ్లి బట్టలతోపాటు పెట్టుకున్న పగిడి కూడా తీయకుండా ఎదురు చూశాడు. పెళ్లి మండపాన్ని.. అదే అలంకరణలతో అలాగే ఉంచారు. ఎట్టకేలకి 13 రోజుల తర్వాత…పెళ్లి కుమార్తె తన మొండిపట్టు వీడి కళ్యాణ మండపానికి చేరుకుంది. అలా 16వ తేదీన వీరి వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!