Congress: ఇక తెలంగాణ, మధ్యప్రదేశ్పై కాంగ్రెస్ నజర్.. మే 24న మీటింగ్..
Congress: కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ చాలా ఉత్సాహంగా ఉంది. గత 34 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఓట్లను, సీట్లను సంపాదించింది. మొత్తం 224 స్థానాల్లో పోటీ చేస్తే 135 సీట్లలో గెలుపొందింది. బీజేపీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అంతకుముందు ఏడాది హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ఇదిలా ఉంటే మరింత దూకుడుగా ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. కర్ణాటక ఊపునే ఈ రాష్ట్రాల్లో చూపాలని అనుకుంటోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలపై నజర్ పెట్టింది. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే గత నాలుగు పర్యాయాలుగా బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు సంపాదించినా.. జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటుతో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు క్రెడిట్ ఉన్నా కూడా గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉంది. దీంతో పాటు అంతర్గత విభేదాలుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేకపోవడానికి కారణం అవుతున్నాయి.
Also Read
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
Read Also: New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి.. ప్రధాని కాదు
ఈ 4 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. నాలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో మే 24న అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ లో బీజేపీ నుంచి అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2018 ఎన్నికల్లో సింథియా వర్గీయులు 22 మంది కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. వీరంతా రాజీనామా చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీలో చేరి మళ్లీ గెలిచారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జ్యోతిరాధిత్య సింథియా వర్గీయులతో కలిసి, బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది.
ఇక రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ తో అంతర్గత విభేదాలు బజారున పడ్డాయి. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్లు బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలను చల్లార్చడానికి ప్రయత్నిస్తున్న సఫలం కావడం లేదు. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఓటర్లు ప్రతీ సారి ప్రభుత్వాన్ని మార్చే సంస్కృతిని కలిగి ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల గండాన్ని కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Jowar Dosa : షుగర్కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!