Congress: ఇక తెలంగాణ, మధ్యప్రదేశ్పై కాంగ్రెస్ నజర్.. మే 24న మీటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ చాలా ఉత్సాహంగా ఉంది. గత 34 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఓట్లను, సీట్లను సంపాదించింది. మొత్తం 224 స్థానాల్లో పోటీ చేస్తే 135 సీట్లలో గెలుపొందింది. బీజేపీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అంతకుముందు ఏడాది హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ఇదిలా ఉంటే మరింత దూకుడుగా ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. కర్ణాటక ఊపునే ఈ రాష్ట్రాల్లో చూపాలని అనుకుంటోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలపై నజర్ పెట్టింది. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే గత నాలుగు పర్యాయాలుగా బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు సంపాదించినా.. జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటుతో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు క్రెడిట్ ఉన్నా కూడా గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉంది. దీంతో పాటు అంతర్గత విభేదాలుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేకపోవడానికి కారణం అవుతున్నాయి.
Also Read
- Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
- VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
Read Also: New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి.. ప్రధాని కాదు
ఈ 4 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. నాలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో మే 24న అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ లో బీజేపీ నుంచి అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2018 ఎన్నికల్లో సింథియా వర్గీయులు 22 మంది కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. వీరంతా రాజీనామా చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీలో చేరి మళ్లీ గెలిచారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జ్యోతిరాధిత్య సింథియా వర్గీయులతో కలిసి, బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది.
ఇక రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ తో అంతర్గత విభేదాలు బజారున పడ్డాయి. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్లు బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలను చల్లార్చడానికి ప్రయత్నిస్తున్న సఫలం కావడం లేదు. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఓటర్లు ప్రతీ సారి ప్రభుత్వాన్ని మార్చే సంస్కృతిని కలిగి ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల గండాన్ని కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
-
India vs England: “బుడ్డోడా నీ ప్రతిభకు సలాం”.. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
-
Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!
-
Jr NTR : ఎన్టీఆర్ అన్స్టాపబుల్ లైనప్.. మూడు భారీ ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!