Congress: రాజస్థాన్ సంక్షోభంపై కాంగ్రెస్ కీలక సమావేశం.. గెహ్లాట్, పైలెట్ మధ్య సఖ్యత కుదిరేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అయితే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మాత్రం తారాస్థాయికి చేరుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు మాత్రం సమసిపోవడం లేదు. స్వపక్షంలోనే ఉంటూ విపక్షాల్లా విమర్శించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ రోజు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ని అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. గెహ్లాట్ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.
ఈ ఇద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో అధిష్టానం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ధీ ఇటు గెహ్లాట్ వర్గం, అటు పైలెట్ వర్గం ఏ మాత్రం తగ్గడం లేదు. మూడేళ్ల క్రితం సచిన్ పైలెట్ చేసిన తిరుగుబాటు విఫలం అయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య పడటం లేదు. అయితే ప్రస్తుతం గెహ్లాట్ ను పిలిచిన అధిష్టానం, త్వరలో పైలెట్ ను పిలిచి చర్చిస్తారని తెలుస్తోంది. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలను పరిష్కరించి, ఇద్దరు కలిసి పనిచేసేలా చేసి కర్ణాటకలో భారీ విజయాన్ని సాధించింది కాంగ్రెస్. అదే ఫార్ములాను ఇక్కడ కూడా వర్తింపచేయాలని చూస్తున్నాడు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
Read Also: Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు లీగల్ నోటీసు.. రూ.1000కోట్లకు పరువునష్టం దావా
గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి పైలెట్ ఎక్కువగా కృషి చేశాడు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించారు. కానీ అధిష్టానం మాత్రం అశోక్ గెహ్లాట్ ను సీఎంగా చేసింది. అప్పటి నుంచి పైలెట్, అతని వర్గంలో అసంతృప్తి ఉంది. ప్రస్తుతం పైలెట్ బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీక్ స్కామ్ పై చర్యలు తీసుకోవాలని సీఎం గెహ్లాట్ ను డిమాండ్ చేస్తున్నాడు. ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని అల్టిమెటం జారీ చేశారు. కాంగ్రెస్ తో సంబంధం లేకుండా జన్ సంఘర్ష్ యాత్ర చేపట్టారు పైలెట్.
2018 ఎన్నికల్లో మొత్తం 200 స్థానాల్లో కాంగ్రెస్ 100, బీజేపీ 73 స్థానాల్లో గెలిచింది. రాజస్థాన్లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా 2 సార్లు గెలిచింది లేదు. ప్రతీ సారి రాజస్థాన్ ఓటర్లు ప్రభుత్వాన్ని మారుస్తుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. వరసగా రెండోసారి గెలుద్దాం అని అనుకుంటున్న కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!