Rajasthan: ప్రభుత్వ భవనం కింద రూ.2000 నోట్ల కట్టలు, బంగారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: అవినీతి అధికారులు, అవినీతి డబ్బును దాచేందుకు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే వాడకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని జైపూర్ నగరంలోని యోజన భవన్లోని బేస్మెంట్లో తాళం వేసి ఉన్న అల్మారా నుంచి ₹ 2.31 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బేస్మెంట్లోకి తరుచుగా వెళ్లే ఏడుగురు ప్రభుత్వ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: PM Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ భేటీ.. యుద్ధం తర్వాత ఇదే తొలిసారి
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
అల్మారాలో దాచి ఉంచిన ట్రాలీ సూట్కేస్లో రూ.2000, రూ.500 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. ఆర్బీఐ రూ. 2000 కరెన్సీ చెలామణిని ఉపసంహరించుకున్న తర్వాతి రోజే రికవరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు అధికారులు వివరించారు. సూట్కేస్ నిండా నగదు, బంగారం కనుగొన్నామని, ఆ తర్వాత అనుమానిత ఉద్యోగులను అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించామని జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం రూ. 2.31 కోట్ల నగదు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ-ఫైలింగ్ ప్రాజెక్ట్ కింద ఫైళ్లను స్కాన్ చేసి డిజిటలైజ్ చేస్తున్నామని, తాళం వేసి ఉంచిన రెండు అల్మారాలను తెరిచిన సమయంలో భారీగా డబ్బు, బంగారం కనిపించినట్లు అధికారలు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు అల్మారాలు గత కొంత కాలంగా తాళం వేేసే ఉన్నాయి. డబ్బు ఎవరిది..ఎలా వచ్చింది.. విచారణ జరుపుతున్నారు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ అంశంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం బీజేపీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. యోజన భవన్ లోకి ఇంత డబ్బు ఎలా వచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!