Rajasthan: ప్రభుత్వ భవనం కింద రూ.2000 నోట్ల కట్టలు, బంగారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: అవినీతి అధికారులు, అవినీతి డబ్బును దాచేందుకు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే వాడకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని జైపూర్ నగరంలోని యోజన భవన్లోని బేస్మెంట్లో తాళం వేసి ఉన్న అల్మారా నుంచి ₹ 2.31 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బేస్మెంట్లోకి తరుచుగా వెళ్లే ఏడుగురు ప్రభుత్వ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: PM Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ భేటీ.. యుద్ధం తర్వాత ఇదే తొలిసారి
Also Read
- Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
అల్మారాలో దాచి ఉంచిన ట్రాలీ సూట్కేస్లో రూ.2000, రూ.500 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. ఆర్బీఐ రూ. 2000 కరెన్సీ చెలామణిని ఉపసంహరించుకున్న తర్వాతి రోజే రికవరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు అధికారులు వివరించారు. సూట్కేస్ నిండా నగదు, బంగారం కనుగొన్నామని, ఆ తర్వాత అనుమానిత ఉద్యోగులను అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించామని జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం రూ. 2.31 కోట్ల నగదు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ-ఫైలింగ్ ప్రాజెక్ట్ కింద ఫైళ్లను స్కాన్ చేసి డిజిటలైజ్ చేస్తున్నామని, తాళం వేసి ఉంచిన రెండు అల్మారాలను తెరిచిన సమయంలో భారీగా డబ్బు, బంగారం కనిపించినట్లు అధికారలు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు అల్మారాలు గత కొంత కాలంగా తాళం వేేసే ఉన్నాయి. డబ్బు ఎవరిది..ఎలా వచ్చింది.. విచారణ జరుపుతున్నారు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ అంశంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం బీజేపీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. యోజన భవన్ లోకి ఇంత డబ్బు ఎలా వచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
-
Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
-
Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
-
Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!