The IQ Era థీమ్తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్ కానున్నాయంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MWC 2026 – The IQ Era: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ టెక్ ఈవెంట్గా గుర్తింపు పొందిన MWC Barcelona 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. స్పెయిన్ లో జరుగుతున్న ఈ మెగా టెక్ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు, స్టార్ట్ప్లు, డెవలపర్లు, టెక్ పరిశ్రమ నిపుణులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఈవెంట్ కు “The IQ Era” అనే థీమ్ తో ఈవెంట్ ను కొనసాగనించనున్నారు. స్మార్ట్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటెలిజెంట్ సిస్టమ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశ్యం.
IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
Also Read
- Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
- Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
- Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నేటి నుంచి మార్చి 5 వరకు స్పెయిన్లోని “ఫిరా బార్సిలోనా గ్రాన్ వయా” వేదికగా నిర్వహించబడుతోంది. గత 20 సంవత్సరాలుగా స్పెయిన్ ఈ మెగా టెక్ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తోంది. మార్చి 2 నుంచి 4 వరకు ఉదయం 8:30 CET నుంచి సాయంత్రం 19:00 CET వరకు కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజు అయిన మార్చి 5న కూడా అదే సమయానికి ప్రారంభమై, మధ్యాహ్నం 16:00 CETకు ముగుస్తుంది.
India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?
“The IQ Era” అనే థీమ్ కింద ఈసారి AI ఆధారిత స్మార్ట్ సొల్యూషన్స్, ఇంటెలిజెంట్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ మొబైల్ టెక్నాలజీలపై చర్చలు, ప్రదర్శనలు జరుగనున్నాయి. వివిధ కంపెనీలు తమ కొత్త ఆవిష్కరణలను సెషన్లు, కీ నోట్ ప్రసంగాల ద్వారా ప్రదర్శించనున్నాయి. ఈవెంట్కు హాజరుకావాలనుకునే వారు ముందుగా అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈసారి పలు ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లు తమ కొత్త డివైస్ లను లాంచ్ చేసే అవకాశముంది. ముఖ్యంగా నథింగ్ నుండి “Nothing Phone 4a, Nothing Phone 4a Pro” మోడళ్లను తీసుకరావచ్చని సమాచారం. ఇంకా Xiaomi 17, Oppo Find X9 Pro వంటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు కూడా ప్రదర్శించవచ్చని తెలుస్తోంది. అయితే కంపెనీలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!