ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (28) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సిద్ధూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ.. రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ…
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ప్రస్తుతం కొండా సురేఖ, మురళీ దంపతుల చుట్టూ తిరుగుతున్నాయి. 2018లో పరకాలలో సురేఖ ఓటమి తర్వాత పెద్దగా చర్చల్లోకి వచ్చింది లేదు. రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక ఆయనకు దగ్గరయ్యారు. మరోసారి జిల్లాలో చక్రం తిప్పుతారని భావించాయి పార్టీ శ్రేణులు. ఇంతలో హుజూరాబాద్ ఉపఎన్నిక పీసీసీ చీఫ్, కొండా ఫ్యామిలీ మధ్య దూరం పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వరంగల్ తూర్పు తమ సొంత నియోజకవర్గంగా…
కర్నాటకలో జరిగిన రెడ్డి సామాజికవర్గం సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన కామెంట్స్ చుట్టూ కాంగ్రెస్లో చర్చతోపాటు రచ్చ రచ్చ అవుతోంది. రెడ్లకు పగ్గాలు అప్పగించాలన్న ఆయన కామెంట్స్పై కాంగ్రెస్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై సీరియస్గా స్పందించిన వీ హన్మంతరావు PACలో చర్చిస్తామని ప్రకటించారు. VH లోలోన రగిలిపోతున్నా… పార్టీ నేతలు ఎవరూ మీడియా ముందుకు వెళ్లొద్దన్న రాహుల్గాంధీ సూచనలతో వేచి చూస్తున్నట్టు చెబుతున్నారు. అయితే AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్…
రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన రేవంత్కు బహిరంగ లేఖ…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలిటికల్ పార్టీలు స్పీడ్ పెంచాయి. రాహుల్గాంధీ సభ తర్వాత దూకుడుగా వెళ్తోంది కాంగ్రెస్. బీజేపీ కూడా పట్టు పెంచుకోవడానికి చూస్తోంది. ఇదే సమయంలో ఆధిపత్యాన్ని నిలుపుకొనే పనిలో గట్టిగానే పావులు కదుపుతోంది అధికార టీఆర్ఎస్. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉంది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు.. పార్టీ నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని టీఆర్ఎస్ పెద్దల నుంచి సూచనలు వెళ్లాయి. దీంతో గత 20 రోజులుగా ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పనిలో…
ధాన్యం కొనలేని కేసీఆర్.. దిల్లీ వెళ్లి డ్రామాలాడటాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండి పడ్డారు. ఖమ్మంజిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులు.. ఇవాళ బ్యాంకులకు రెండున్నర రెట్లకుపైగా బకాయిపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్నివిధాలుగా సంక్షోభంలో ఉన్న రైతుల్లో మానసిక, మనోధైర్యాన్ని నింపేందుకే…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోకూడదని, మీడియాకి ఎక్కి పార్టీ పరువును గంగపాలు చేయవద్దన్న సూచనలకు అనుగుణంగా తాజా పరిణామాలపై వీహెచ్ తనదైన రీతిలో స్పందించారు. రేవంత్ రెడ్డి పై వీహెచ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో మాట్లాడినా బీసీ, ఎస్సీ ఎస్టీల లో ఒక విధమైన ఆలోచన వచ్చింది. కానీ నీ విషయంలో నేను బయట మాట్లాడలేను. నేను ఓబీసీ…
రాహుల్ గాంధీ లండన్ లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. లండన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ థింక్ ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో కేంద్రంపై, బీజేపీ సర్కార్ పై విమర్శలు చేశారు. బీజేపీ దేశంపై కిరోసిన్ జల్లిందని కేవలం ఒక నిప్పు చాలు సంక్షోభానికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే విదేశాంగ శాఖ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ విధానం మారిందని వారు అంటున్నారు… అహంకారంతో ఉన్నారంటూ…
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రాహుల్ గాంధీకి అసద్ సవాల్ చేయాల్సిన అవసం ఏముంది..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వచ్చింది రైతుల కోసం.. అసద్ కి నేను సవాల్ వేస్తున్నా.. నీ జిందగీలో ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశావా..? అని నిలదీశారు. 12 శాతం రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డ ఆయన.. తెలంగాణ ఇచ్చిన రాహుల్.. ఇక్కడ…
యూకే పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. బీజేపీ దేశంపై కిరోసిన్ చల్లిందని… ఒక్క నిప్పు రాజేస్తే సంక్షోభమే అని ఆయన విమర్శించారు. బీజేపీ సర్కార్ అన్నింటిని ప్రైవేట్ చేస్తోందని… ప్రైవేటు గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. మీడియాను కూడా నియంత్రించాలని భావిస్తున్నారని అన్నారు. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులను ఒకే కంపెనీ నియంత్రించాలనుకోవడం ప్రమాదకరం అని ఆయన అన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి…