ముస్లిం యువతుల వివాహాలపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో పేర్కొంది. 21 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల యువతి కుటుంబ సభ్యుల నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ముస్లిం దంపతుల రక్షణ పిటిషన్ను జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ ధర్మాసనం విచారిస్తూ ఈ తీర్పును వెలువరించింది. జస్టిస్ బేడి షరియా…
34 ఏళ్ల నాటి రోడ్డు రేస్ కేసులో పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పంజాబ్ కాంగ్రెస్ నేత నవ్యజోత్ సింగ్ సిద్దూ ఆస్పత్రి పాలయ్యారు. ఈ మేరకు ఆయన చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లో చేరారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో సిద్ధూను పాటియాలా జైలు నుంచి భారీ భద్రతతో పీజీఐఎంఈఆర్కి పోలీసులు తరలించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హెపటాలజీ విభాగంలో సిద్దూ వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Destination…
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ లు తగులుతూనే ఉన్నాయి. వరసగా పార్టీలోని కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. దశాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వరసగా ఎన్నికల్లో విఫలం అవుతుండటం, అంతర్గత కుమ్ములాటలు పార్టీని బలహీన పరుస్తున్నాయి. దీనికి తగ్గట్లుగా హైకమాండ్ నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చింతన్ శిబిర్ తర్వాత కూడా పార్టీ నామామాత్రపు చర్యలకే పరిమితం అయింది. పార్టీ తీరుతో విసిగిపోయిన చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ పార్టీలో చేరుతున్నారు.…
డ్రగ్స్, మాఫియా, సెలబ్రిటీ హత్య…వరుస వివాదాలు ఏం చెప్తున్నాయి?ఆప్ ప్రభుత్వం ముందు అన్నీ సవాళ్లేనా?పంజాబ్ మళ్లీ ఖలిస్తాన్ గా మారబోతోందా?తీవ్రవాదం, మాఫియాతో రగిలిపోనుందా? పంజాబ్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.ఆ రాష్ట్రలో ఏం జరుగుతోంది?ఏం జరగబోతోందనే ఆందోళన పెరుగుతోంది.నిజానికి అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వివాదాలు మాత్రం కామన్. డ్రగ్స్ మాఫియా, ఇటీవల రైతు ఉద్యమాలు, ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ హత్య..ఇలా నిత్యం ఏదో వివాదంలో నిలుస్తోంది.ఇప్పుడు ఖలిస్తాన్ నినాదం మళ్లీ…
పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా దారుణంగా చంపేశారు. ఈ రోజు పెద్ద ఎత్తున్న ప్రజల మధ్య ఆయన అంతిమ సంస్కాారాలు పూర్తయ్యాయి. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక నిజాలు బయటపడ్డాయి. సిద్దూ శరీరంలో 24 బుల్లెట్ గాయాలు కనిపించాయని వైద్యులు వెల్లడించారు. కాళ్లు, పొట్ట, తలలో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. బుల్లెట్లు సిద్దూ శరీరాన్ని ఛిద్రం చేశాయి. సిద్దూ లివర్ లో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఐదుగురు డాక్టర్ల టీం సిద్దూకు…
ప్రముఖ పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలాని చంపింది తామేనంటూ గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఫేస్బుక్ మాధ్యమంగా ప్రకటించిన విషయం తెలిసిందే! కెనడాలో ఉంటున్న తాను.. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయితో కలిసి అతని హత్యకు కుట్ర పన్నినట్టు వెల్లడించాడు. తమ సన్నిహితుల హత్యలో సిద్ధూ ప్రమేయం ఉందని తెలియడంతోనే తాము అతడ్ని అంతమొందించినట్లు గోల్డీ తెలిపాడు. దీంతో, ఆల్రెడీ పలు కేసుల్లో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ను పోలీసులు రిమాండ్లోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. అయితే.. ఈ…
వరిదిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ ను మించి పోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి వర్జీనియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐల మీట్&గ్రీట్ నిర్వహించారు. సుమారు 300 మంది ఎన్ఆర్ఐలు ఇందులో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పై ఎన్ఆర్ఐలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి జగదీష్…
పంజాబ్లో ఇటీవలే ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మేరకు కొత్త కేబినెట్లో ఆప్ నేత విజయ్ సింఘ్లాకు ఆరోగ్య శాఖను సీఎం భగవంత్ మాన్సింగ్ కట్టబెట్టారు. అయితే రెండు నెలలు తిరగకముందే మంత్రి పదవిని విజయ్ సింఘ్లా దుర్వినియోగం చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ కాంట్రాక్టుల కోసం మంత్రి విజయ్ సింఘ్లా ఒక శాతం కమిషన్ అడుగుతున్నారని ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం భగవంత్…