SidhuMooseWala: దారుణంగా చంపారు.. శరీరంలో 24 బుల్లెట్ గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా దారుణంగా చంపేశారు. ఈ రోజు పెద్ద ఎత్తున్న ప్రజల మధ్య ఆయన అంతిమ సంస్కాారాలు పూర్తయ్యాయి. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక నిజాలు బయటపడ్డాయి. సిద్దూ శరీరంలో 24 బుల్లెట్ గాయాలు కనిపించాయని వైద్యులు వెల్లడించారు. కాళ్లు, పొట్ట, తలలో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. బుల్లెట్లు సిద్దూ శరీరాన్ని ఛిద్రం చేశాయి. సిద్దూ లివర్ లో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఐదుగురు డాక్టర్ల టీం సిద్దూకు పోస్ట్ మార్టం నిర్వహించారు. శరీరంలోని ప్రతీ భాగంలో కూడా బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ తో సిద్దూ మరణించారని వైద్యులు వెల్లడించారు.
ఈ రోజు ఆయన స్వగ్రామం మన్సాలో అంతిమ యాత్ర నిర్వహించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, ఆయన అభిమానాలు తరలివచ్చారు. సిద్దూ చివరి కార్యక్రమంలో ప్రజలు ఎక్కవగా పాల్గొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంజాబ్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read
పంజాబ్ లోని ఆప్ సర్కార్ 400 మందికి పైగా వ్యక్తులకు సెక్యురిటీ తొలగించిన 24 గంటల్లోనే సిద్దూ మూసేవాలా దారణహత్య జరిగింది. తన మహేంద్రా థార్ వాహనంలో బయటకు వెళ్లిన క్రమంలో పక్కా స్కెచ్ ప్రకారం దుండగులు సిద్దూపై పాయింట్ రేంజ్ లో కాల్పులు జరిపారు. దాదాపుగా 30 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్లు తెలిసింది. దుండగులు చంపడానికి ఏకే 47 రైఫిల్ వాడినట్లు తెలుస్తోంది. కెనడా గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ ఈ కేసులోె ప్రధాన నిందితులని అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!