ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా వున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేజ్రీవాల్ నివాసంలో కేసీఆర్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు కేసీఆర్, కేజ్రీవాల్ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం చండీగఢ్ బయలు దేరారు సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్. కేసీఆర్ కారులోనే బయలు దేరారు కేజ్రీవాల్. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చండీగఢ్కు పయనమయ్యారు. గాల్వన్ వ్యాలీ అమరవీరుల జవానులకు నివాళులు అర్పించారు కేజ్రీవాల్, కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. అనంతరం రైతు ఉద్యమంలో చనిపోయిన 600 రైతు…
కాంగ్రెస్ లీడర్, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. 20 ఏళ్ల నాటి కేసులో జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 1988 జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి మరణించిన కేసులో సిద్దూకు సుప్రీంకోర్ట్ గురువారం ఒక సంవత్సరం జైలు శిక్షను విధించింది. ఈ కేసులో సిద్దూకు నేరం చేశాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్ట్ మే 18, 2018న రూ. 1000…
వరుస పరాజయాలు, షాక్లతో దెబ్బతిన్న పార్టీని మళ్లీ గాడిలోపెట్టేందుకు ఓ వైపు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోన్న సమయంలో.. మరో సీనియర్ నేత, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉన్న వ్యక్తి గుడ్బై చెప్పేశారు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యోతన జైపూర్లో చింతన్ శిబర్ జరుగుతోన్న వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాకర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు..…
ఆర్సీపీపై పంజాబ్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది ఆర్సీబీ. ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేక చతికిలపడింది. శుక్రవారం ముంబై బ్రెబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ముందు ఉంచింది. కాగా భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన ఆర్సీబీ ఎక్కడా పోటీ ఇవ్వలేదు. ఒక్కరంటే ఒక్క ప్లేయర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్…
మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది.. భవనంలోపల గ్రెనేడ్ పడినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇవాళ రాత్రి పేలుడు సంభవించింది. రాకెట్తో నడిచే గ్రెనేడ్ భవనంలోని మూడో అంతస్తులో పడిందని చెబుతున్నారు.. పేలుడు ధాటికి కిటికీలు, డోర్లు ధ్వంసమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాకెట్ లాంచర్ ఉపయోగించి దాడికి పాల్పడినట్టుగా అంచనా వేస్తున్నారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. కార్యాలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఘటనా స్థలాన్ని…
పంజాబ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి తేజేంద్రపాల్ సింగ్ బగ్గా అరెస్ట్, విడుదల నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. బగ్గాను అర్ధరాత్రి గురుగ్రామ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఆయన వీపు, భుజానికి గాయమైందని లాయర్ చెప్పడంతో.. ఆయన విడుదలకు మేజిస్ట్రేట్ అనుమతించారు. దాంతో బగ్గా ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు ఢిల్లీలోని తేజేంద్రపాల్ సింగ్ బగ్గా నివాసంలో ఆయన్ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను జనక్పురి పోలీస్స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు.…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.. దీంతో, ఢిల్లీ పరిమితం అనుకున్న ఆ పార్టీ.. మరో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.. ఇక, ఢిల్లీలో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి.. పంజాబ్లో పరిస్థితి వేరు.. తాము ఏంటో చూపిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే అనేక సంస్కరణలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆప్ ప్రభుత్వం.. ఆ…
పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ విరుచుకుపడ్డారు. ఆయనో రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ ధ్వజమెత్తారు. అసలు పాలన అంతా ఢిల్లీ నుంచే సాగుతోందని, అరవింద్ కేజ్రీవాలే నడిపిస్తున్నారని ఆరోపించారు సిద్ధూ… భగవంత్ మాన్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పంజాబ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎం చెన్నీ, సిద్ధూతో సహా కాంగ్రెస్ నేతలు గవర్నర్ భన్వరీలాల్తో భేటీ అయ్యారు.. వాటిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.…
పంజాబ్లోని లుథియానాలో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చెలరేగిన మంటల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరణించిన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. లూథియానాలోని టిబ్బా రోడ్డులో మున్సిపల్ డంప్ యార్డుకు సమీపంలో గల గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు గుడిసెకు నిప్పు అంటుకున్న విషయంపై…
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన ప్రముఖ మాజీ క్రికెటర్ హర్భజన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు రాజ్యసభ నుంచి వచ్చే జీతాన్ని రైతుల పిల్లల చదువు కోసమే ఖర్చు చేస్తానని హర్భజన్ స్పష్టం చేశాడు. ఒక రాజ్యసభ సభ్యుడిగా రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం తన వేతనాన్ని వారికే ఇచ్చేస్తున్నానని హర్భజన్ ట్వీట్ చేశాడు. మన దేశం అభివృద్ధి చెందేందుకు తన వంతు సాయం చేస్తానని పేర్కొన్నాడు. దేశాన్ని మరింత ఉన్నతంగా…