వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికైన తరుణంలోనే ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 2, 3 తేదాల్లో జరిగే సమావేశాల ఏర్పాట్లలో ఈటలకు కూడా బాధ్యతలు అప్పగించింది పార్టీ. కానీ.. కొన్నాళ్లుగా బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనలో మాజీ మంత్రి ఉన్నట్టు టాక్. ముందరి కాళ్లకు బంధాలేస్తున్నారనే ఫీలింగ్లో ఉన్నారట. బీజేపీలోని కొందరు నాయకుల వైఖరి పట్ల కినుకతో ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో బీజేపీలో ఈటల…
విజయారెడ్డి. కాంగ్రెస్ దివంగత నేత PJR కుమార్తె. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్. రాజకీయ ప్రయాణాన్ని వైసీపీ నుంచి మొదలుపెట్టిన ఆమె.. 2014లో ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారామె. ఖైరతాబాద్ డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్గా గెలిచారు. 2018లో మరోసారి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీచేయాలని విజయారెడ్డి ఆశించినా.. టీఆర్ఎస్ మాత్రం దానం నాగేందర్కు ఛాన్స్ ఇచ్చింది. తనకు రావాల్సిన సీటును దానం తన్నుకుపోయారని…
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఒకవైపు బీజేపీ నేతలు మరోవైపు విపక్ష నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. అధికార బిజెపి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో మంతనాలు జరుపుతోంది. ఇటు విపక్షలు కూడా అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు పక్షాల నుంచి అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. విపక్షాలు ఒక తాటిపైకి వచ్చే ప్రయత్నాలు అయితే తెరవెనక గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నెల 21న మరోసారి విపక్ష పార్టీలు మళ్లీ భేటీ…
వచ్చే నెల 2,3 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్లో జరగబోతున్నాయి. ఈ సమావేశాల ద్వారా తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం తీసుకురావాలని పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాల రూపకల్పన చేశారు కమలనాథులు. 3న ప్రధాని మోడీతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధానితోపాటు ముఖ్య నేతలంతా సభకు హాజరవుతారు కూడా. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో సభను సక్సెస్ చేయాలన్నది బీజేపీ ఆలోచన. ఇటీవల జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు,…
‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. జవాన్లను కోపాద్రిక్తుల్ని చేశాయి. ఆదివారం మీడియాతో మాట్లాడిన కైలాష్.. ‘‘ఒక అగ్నివీర్ సైనిక శిక్షణ పొంది, నాలుగు సంవత్సరాల తర్వాత సేవ నుండి నిష్క్రమిస్తాడు. ఆ సమయంలో అతడు రూ. 11 లక్షలు అందుకోవడంతో పాటు అగ్నివీర్ బ్యాడ్జ్ని ధరిస్తాడు. అనంతరం ఇతర విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు,…
అగ్నిపథ్ ఎందుకు మంటలు రేపుతోంది?కేంద్రం ఏమంటోంది? అభ్యర్థుల సమస్యేంటి?అగ్నిపథ్ పథకంతో ఆర్మీకి ప్రయోజనం ఎంత?జీతాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించటానికే ఈ స్కీమ్ తెచ్చారా? కేంద్ర ప్రభుత్వం మంగళవారం త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తమకు అన్యాయం చేస్తోందంటూ సైనిక నియామక రిక్రూట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్న యువకులు దేశంలోని పలుచోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు. నిరుద్యోగుల ఆందోళనలు…
కెసీఆర్ జాతీయ పార్టీ ..ఇప్పుడిదే సంచలనం..రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ…ఈ పార్టీ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఒకటైతే.. అసలు ఢిల్లీ రాజకీయాల్లో దక్షిణాది జాతీయ పార్టీ నిలబడుతుందా అనేది మరో చర్చ..గులాబీ పార్టీ పునాదులపై నిలిచే బీఆర్ఎస్ కున్న సాధ్యాసాధ్యాలేంటి?ఇదే ఈ రోజు స్టోరీ బోర్డ్. చాలా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైతే చాలా వరకు ఊహాగానాలే.కానీ, కెసీఆర్ వ్యూహాలు సామాన్యంగా ఉండవనేది అందరూ ఒప్పుకునే విషయమే. అందుకే బీఆరెస్ విషయంలో క్లారిటీ వచ్చే వరకు ఈ ఉత్కంఠ…
తెలంగాణ ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ రెండుసార్లు అధికారాన్ని చేజిక్కుంచుకొంది. మూడవసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ ప్యాక్తో గులాబీపార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆ సంస్థ పలు నివేదికలను టీఆర్ఎస్ పెద్దలకు అందచేస్తోంది. సీఎం కేసీఆర్తో పీకే సమావేశమై అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరించారట. ఆ విషయాలను వడపోసిన తర్వాత టీఆర్ఎస్ వేగంగా చర్యలు మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది.…
ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ ఎంపీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సడెన్గా హాట్ హాట్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్గా ఉంటూ.. కీలక అంశాలపై అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో రాజకీయ వేడి కాక మీద ఉంది. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ అజెండాతో ముందుకెళ్లాలని చూస్తున్న సీఎం కేసీఆర్ BRS పేరుతో కొత్త నేషనల్ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. అలాంటి కేసీఆర్తో ఉండవల్లి భేటీ కావడం…
ఈ దఫా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికైంది హైదరాబాద్. చురుకుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వచ్చే నెల 2 నుంచి జరిగే మీటింగ్స్ కోసం బీజేపీ పెద్దలు ఏర్పాట్లపై వరసగా సమీక్షలు చేస్తున్నారు కూడా. సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా.. పని విభజనపై కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది బీజేపీ. కేవలం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసమే ఆ కమిటీల కూర్పు జరిగింది. దాదాపు 30 విభాగాలను గుర్తించి.. అక్కడ ఎవరెవరు.. ఏఏ పనులు…