CM Revanth Reddy: అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం
- అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం
- మావోయిస్టు లొంగుబాట్లు, పునరావాసంపై సుదీర్ఘ చర్చ
- “మావోయిస్టు రహిత భారత్” కాన్ఫరెన్స్పై వ్యూహాలు
- కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో భద్రతా బలోపేతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలో జరిగిన ఈ సమావేశం సుమారు గంటకు పైగా కొనసాగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ , మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని మావోయిస్టుల అంశం చర్చకు వచ్చింది. మావోయిస్టుల లొంగుబాటు (Surrender) , వారికి పునరావాసం కల్పించే అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఈ నెల 31న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న “మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్” గురించి కూడా ఈ భేటీలో ప్రాథమిక చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా నక్సలిజం ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించే ఈ సదస్సులో తెలంగాణ తరపున అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ షాతో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం.
Also Read
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఈ భేటీలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి , ఐజి సుమతి ఈ సమావేశానికి హాజరై, రాష్ట్రంలోని భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రికి వివరించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో తెలంగాణలో మావోయిస్టు ముప్పును పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. భద్రతా పరమైన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో దృష్టి సారించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!