CM Revanth Reddy: అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం
- అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం
- మావోయిస్టు లొంగుబాట్లు, పునరావాసంపై సుదీర్ఘ చర్చ
- “మావోయిస్టు రహిత భారత్” కాన్ఫరెన్స్పై వ్యూహాలు
- కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో భద్రతా బలోపేతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలో జరిగిన ఈ సమావేశం సుమారు గంటకు పైగా కొనసాగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ , మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని మావోయిస్టుల అంశం చర్చకు వచ్చింది. మావోయిస్టుల లొంగుబాటు (Surrender) , వారికి పునరావాసం కల్పించే అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఈ నెల 31న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న “మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్” గురించి కూడా ఈ భేటీలో ప్రాథమిక చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా నక్సలిజం ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించే ఈ సదస్సులో తెలంగాణ తరపున అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ షాతో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఈ భేటీలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి , ఐజి సుమతి ఈ సమావేశానికి హాజరై, రాష్ట్రంలోని భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రికి వివరించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో తెలంగాణలో మావోయిస్టు ముప్పును పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. భద్రతా పరమైన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో దృష్టి సారించారు.
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!