BJP :బీజేపీ అనుకూల వాతావరణం కోసం నేతల పాట్లు.. దేనికోసం ఆ పాట్లు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెల 2,3 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్లో జరగబోతున్నాయి. ఈ సమావేశాల ద్వారా తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం తీసుకురావాలని పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాల రూపకల్పన చేశారు కమలనాథులు.
3న ప్రధాని మోడీతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధానితోపాటు ముఖ్య నేతలంతా సభకు హాజరవుతారు కూడా. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో సభను సక్సెస్ చేయాలన్నది బీజేపీ ఆలోచన. ఇటీవల జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శల సమావేశాలో సభపై చర్చ జరిగింది. దాదాపు 10 లక్షల మందిని సభకు తరలించాలని నిర్ణయించారు. ఏ ప్రాంతం నుంచి ఎంత మందిని సభకు తీసుకురావాలి.. ఎవరు బాధ్యతలు తీసుకోవాలో ఆ సమావేశంలో సూత్రప్రాయంగా చెప్పారట. ప్రధాని మోడీ సభ కావడంతో జన సమీకరణపై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు పార్టీ రాష్ట్ర నేతలు. టార్గెట్లు ఫిక్స్ చేయడంతో.. అంతా ఆ పనిపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాలని సూచించారట. జనసమీకరణకు కావాల్సిన వాహనాలను ముందుగానే మాట్లాడుకోవాలని చెప్పేశారట.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
ప్రస్తుతం బీజేపీ నేతలకు బీపీ తెప్పిస్తున్న మాట పదిలక్షలు. అంతమందిని ఎలా సమీకరించాలో అని మల్లగుల్లాలు పడుతున్నారట. పది లక్షల మందిని తరలించడం అంత ఈజీ కాదని.. అందుకు వాహనాలను సమకూర్చుకోవడం సవాలేనని అనుకుంటున్నారట. పైగా ఇది వర్షాకాలం. సభా సమయంలో వర్షం పడితే ఇబ్బందులు తప్పవు. ఇటు చూస్తే రాష్ట్రంలో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. రైతులు, వ్యవసాయ దారులు.. కూలీలు సాగు పనుల్లో బిజీగా ఉంటారు. ఇంకోవైపు యువతను తరలిద్దామన్నా.. వాళ్లంతా ఉద్యోగాల కోసం గట్టిగానే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఇంకా సంస్థాగతంగా బలంగా లేదు. అలాంటి ప్రాంతాల నుంచి జనాలను తీసుకురావాలని అనుకుంటే అయ్యే పని కాదు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బహిరంగ సభకు ఇంఛార్జ్గా ఉన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్.. పార్టీ నేత ప్రదీప్ కుమార్లు ఆ కమిటీలో ఉన్నారు. వాళ్లంతా జన సమీకరణపై గట్టిగానే కసరత్తు చేస్తున్నత్తు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే ఎక్కువ మందిని తరలిస్తే కొంతలో కొంతైనా అంచనాలకు దగ్గరకు రాగలమని పార్టీ నేతలు భావిస్తున్నారట. అందుకే గ్రేటర్ హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల బీజేపీ నేతలు శక్తి కేంద్రాల ఇంఛార్జులపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రధాని మోడీ సభకు భారీగా జన సమీకరణ బీజేపీ నేతలకు పెద్ద పరీక్షే పెడుతోంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!