TRS : టీఆర్ఎస్.. అసెంబ్లీకి ఇద్దరు ఇంచార్జులు వస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ రెండుసార్లు అధికారాన్ని చేజిక్కుంచుకొంది. మూడవసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ ప్యాక్తో గులాబీపార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆ సంస్థ పలు నివేదికలను టీఆర్ఎస్ పెద్దలకు అందచేస్తోంది. సీఎం కేసీఆర్తో పీకే సమావేశమై అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరించారట. ఆ విషయాలను వడపోసిన తర్వాత టీఆర్ఎస్ వేగంగా చర్యలు మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది.
ఇన్నాళ్లూ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం అన్నది టీఆర్ఎస్ మాట. ఇంకా చెప్పాలంటే జిల్లా మంత్రి కూడా ఎమ్మెల్యే అనుమతి లేకుండా అసెంబ్లీ నియోజకవర్గాలలో జోక్యం చేసుకోవడానికి ఉండదు. పార్టీ వైపునుంచి జిల్లాలకు సీనియర్ నాయకులు ఇంచార్జ్లుగా ఉంటారు. అయితే పీకే నివేదికలపై సమీక్షల తర్వాత ఈ పరిస్థితి మారబోతుందన్న చర్చ గులాబీ శిబిరంలో జరుగుతోంది.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి ఇద్దరు ఇంఛార్జ్లను నియమించే ఛాన్స్ ఉన్నట్టు టాక్. పక్క జిల్లాలకు చెందిన నేతలకు ఇంఛార్జులుగా బాధ్యతలు అప్పగిస్తారట. ఈ ఇంచార్జిలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం హైకమాండ్ నుంచి వచ్చే సలహాలు, సూచనలు సెగ్మెంట్లో అమలు చేస్తారట. ఇప్పటి వరకు ఎమ్మెల్యే నుంచి వచ్చే సమాచారంపైనే పార్టీ ఆధారపడుతూ వచ్చింది. కానీ ఇద్దరు ఇంఛార్జులు వస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని లెక్కలేస్తున్నారట.
ఈ ఇద్దరు ఇంఛార్జుల కాన్సెప్ట్ తెలిసినప్పటి నుంచి పీకే బృందం ఇచ్చిన నివేదికలో ఏముంది అనే ఆసక్తి పెరుగుతోంది. ఎన్నడూ లేనిది ఎమ్మెల్యేను కాకుండా మరో ఇద్దరు నేతలను ఇంఛార్జులుగా పెట్టడంపై ఎవరి స్థాయిలో వారు ఆరా తీస్తున్నారట. ఈ ఇంఛార్జులు సిట్టింగ్లకు ఎసరు పెడతారో లేక పార్టీ బలోపేతానికే నిజంగా చర్యలు తీసుకుంటారో అనే అనుమానాలు ఉన్నాయట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఒక్కటే ఆందోళన. పీకే నివేదికలు తమ సీటుకు ఎక్కడ ఎర్త్ పెడతాయోనని టెన్షన్ పడుతున్నారట. మరి.. ఈ ఇద్దరు ఇంఛార్జుల కాన్సెప్ట్ అధికార పార్టీకి ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!