Chennai: ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో చెన్నై గుడువాంచేరి సమీపంలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ శివగురునాథన్.. పోలీసు శాఖ వాహనాల తనిఖీలో నిమగ్నమై ఉంది. ఆ సమయంలో ఓ నల్లటి కారు వేగంగా వచ్చింది. అతి వేగంగా వస్తున్న కారును చూసిన పోలీసు శాఖ అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
హర్యానాలోని నుహ్లో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 1 గంటలకు విశ్వహిందూ పరిషత్ కాషాయ యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో కాల్పులు, రాళ్ల దాడి జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం ప్రారంభమైన దహనకాండ ఇప్పటికీ ఆగడం లేదు. రోడ్డుపై కాలిపోతున్న వాహనాలు, పొగలు ఇంకా దర్శనమిస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు హోంగార్డులు మరణించగా, మరో ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
వికారాబాద్ జిల్లాలో కేవలం 50 రూపాయల కోసం హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 1000 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా న్యాయస్థానం వెల్లడించింది. గత ఏడాది పెద్దేముల్ మండలం పాషాపూర్ తండాలో రూ.50 ఇవ్వలేదని మంగ్లీ భాయ్ని రాథోడ్ విల్లాస్ అనే వ్యక్తి హత్య చేశాడు.
భారీ వర్షం హైదరాబాద్ నగరానికి మరోసారి వణికించింది. ఇవాళ (సోమవారం) సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసిన సమయం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే, నగరంలో చాలా చోట్ల వాన నీరు రోడ్ల పైన నిలిచిపోయింది.
మాజీ మంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పొంగూరు కృష్ణప్రియ క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసింది.
ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏది లేదు. ఆత్మీయత, అనురాగం, అనుబంధం.. వీటిని మించి అమ్మ ప్రేమలో ఉంటుంది. బిడ్డలపై చూపించే అమ్మ ప్రేమకు మరొకటి సరితూగదు. తన కోసం కాకుండా తన పిల్లల కోసం సర్వస్వం చేస్తుంది. తాను తినకపోయిన తన పిల్లలకు తినిపించాలనే స్వభావం అమ్మ ప్రేమలో ఉంటుంది. అయితే అమ్మ ప్రేమ అనేది.. కేవలం మనుషుల్లోనే కాదు.. అన్నీ జీవుల్లో కూడా అలానే ఉంటుంది. అయితే మాతృప్రేమను చాటిన ఓ ఘటన తాజాగా…
తెలంగాణ సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఎస్పీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త పేటలోని TSSPDCL సీనియర్ అసిస్టెంట్ కు సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లా బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలిక నివసిస్తోంది. అయితే, ఆమెపై ముగ్గురు మైనర్లు ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వారు తమ సెల్ ఫోన్లలో వీడియో కూడా తీసిన.. ఆ ముగ్గరు మైనర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.