సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ తండాలో నివాసం ఉంటున్న బీమ్లా అనే వ్యక్తి ఆందోల్ మండలం అన్నాసాగర్ దగ్గర రోడ్ ప్రమాదం జరగడంతో అతడు అక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలిసిన బీమ్లా తండ్రి తట్టుకోలేక పోయారు, చేతికొచ్చిన కొడుకు తన కళ్ళముందే నిర్జీవంగా పడి ఉండటంతో చూసి జీర్ణించుకోలేని బీమ్లా తండ్రి ధర్మా నాయక్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పోయారు.
వరంగల్ జిల్లాలోని హంటర్ రోడ్డులో కెమికల్ బాక్స్ బ్లాస్ట్ అయింది. ఎన్టీఆర్ నగర్ లో కెమికల్ బాక్స్ బ్లాస్ట్ పేలుడులో భూక్య చంద్రు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వరదలకు బోందివాగులో ఆ బాక్స్ కొట్టుకు వచ్చినట్లుగా గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తేజస్వినీ అనే 17 సంవత్సరాల యువతి తాను పనిచేస్తున్న హాస్పటల్లో ఉరి పెట్టుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, తేజస్విని మహేశ్వరం మండలం గంగారం గ్రామానికి చెందినది.
డీ మ్యాట్ అకౌంట్ వివరాలు తీసుకుని నిందితుల బ్యాంక్ అకౌంట్లు వివరాలు ఇచ్చి అమౌంట్ ను వీరి అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.. దాదాపు 140 మంది బాధితుల నుంచి కోటి ఎనిమిది లక్షల రూపాయల మోసం జరిగింది.. ఎనిమిది నెలలుగా ఈ మోసానికి పాల్పడుతున్నారు అని స్నేహ మెహ్రా పేర్కొన్నారు.
నేరస్థులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సమర్థించుకున్నారు. నేరస్థుల ఇళ్లపై ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్ను సీఎం యోగి ఆదిత్యనాథ్ సమర్థించారు.