Yogi Adityanath: నేరస్థులకు ప్రభుత్వం హారతి పట్టదు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP CM Yogi Adityanath: నేరస్థులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సమర్థించుకున్నారు. నేరస్థుల ఇళ్లపై ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్ను సీఎం యోగి ఆదిత్యనాథ్ సమర్థించారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వారికి హారతులు పట్టాలా..? అంటూ మండిపడ్డారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బుల్డోజర్లతో నేరస్థుల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోందని అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందిస్తూ.. అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వారికి హారతి ఇవ్వాలా? అంటూ ప్రశ్నించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నేరస్థులు, మాఫియాపై తమ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆపరేషన్ సరైనదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఆస్తులను ఇష్టారీతిగా ఆక్రమించుకున్నారని.. గత ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసించలేదని సీఎం యోగి మండిపడ్డారు.
Read also: CM KCR: అన్నాభావు సాఠే చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు
Also Read
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
మైనారిటీ వర్గానికి చెందిన నేరస్థులనే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టారని వచ్చిన ఆరోపణలను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ‘‘దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. అందరికీ న్యాయం చేసేందుకు కోర్టులు ఉన్నాయి. ఇంతవరకు ఒక మైనారిటీ వచ్చి తనకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేయలేదు. రాష్ట్ర ప్రజలందరికీ సమాన పరిపాలన, భద్రత అమలవుతోందని ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి అల్లర్లు జరగలేదని.. ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని వివరించారు. ఈ సందర్భంగా తృణముల్ కాంగ్రెస్పై యోగి మండిపడ్డారు. ఆ పార్టీ దేశాన్ని మరో పశ్చిమ బెంగాల్గా మార్చాలనుకుంటోందని విమర్శించారు. ‘‘పశ్చిమ బెంగాల్లో గ్రామీణ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి వ్యక్తికి ఉందని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.
తాజావార్తలు
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!