తమిళనాడులో ఓ అమానవీయకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మత్తు మాత్రలు ఇచ్చి ఓ హిజ్రాపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన్నీ, బ్లసికాలు చెన్నైపెరంబురు ఏరియాకు చెందిన హిజ్రాలు.
భారతదేశంలో మినీ నయాగరాగా పేరుగాంచిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చిత్రకోట్ జలపాతంలో ఆత్యహత్య చేసుకునేందుకు ఓ యువతి దూకింది. జలపాతం దగ్గర ఉన్న వ్యక్తులు.. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా.. ఆమె నీటిలో దూకేసింది. ఆ యువతి దాదాపు 110 అడుగుల ఎత్తు నుంచి వాటర్ ఫాల్స్ లోకి దూకింది. అదృష్టవశాత్తూ ఆమె చావు నుంచి తప్పించుకుంది.
ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో ఓ యువకుడు తన ప్రియురాలిని గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. కేవలం 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలను బయటపెట్టారు.
భవిష్యత్త్ సాంకేతిక సాధనంగా మారిపోయిన ఈ ఏఐ టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అందుకు ఏఐ ఆధారిత డీప్ఫేక్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తాజాగా ఏఐతో ముఖం మార్చుకున్న ఓ సైబర్ నేరగాడు.. ఓ వ్యక్తి దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. అయితే తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఉత్తరప్రదేశ్లోని బెల్తారా రైల్వే స్టేషన్కి చెందిన రైల్వే పోలీసులు చేసిన పనికి సర్వాత్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిని పోలీసులు తన్నడం మనం చూడవచ్చు. ఆ బాలుడిని కొట్టడంతో అక్కడే ఉన్న జనం ఒక్కసారిగా గుమిగూడారు. కానీ, ఆ పోలీసులు చిన్నారి గొంతుపై కాలు పెట్టి గట్టిగా నొక్కడంతో ఆ పిల్లవాడు తన తలతో పైకి ఎగరడం కనిపిస్తుంది. అయితే, పోలీసుల కర్కశత్వాన్ని ప్రదర్శించడాన్ని.. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్…
మహారాష్ట్రలోని పూణెలో వరుస వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనూప్ వానీగా గుర్తించారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి అమ్మాయిలను వేధించేవాడని పోలీసులు తెలిపారు. దాదాపు 18 మంది బాలికలను వేధించాడని వారు పేర్కొన్నారు.
తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని తెలిపారు. బోనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర కొనసాగుతుంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోడానికి తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. లాల్దర్వాజా బోనాల పండగా సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్న బోనాల పండగా ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. నేడు, రేపు పాతబస్తీలోని ప్రధాన ఆలయాల్లో బోనాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయి. అంబర్ పేట్ లోని మహంకాళి ఆలయంలో ఇవాళ( ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి 18( మంగళవారం) తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో హైదరబాద్ లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు ఆషాడమాసంలో సంప్రదాయంలో భాగంగా బోనాల ఉత్సవాల పండగ జరుపుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగ ఉండటంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మద్యం షాపులు క్లోజో చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మందుబాబులు అర్థరాత్రి వరకు వైన్ షాప్స్ ముందు మందు కొనుగోలు చేశారు.