AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్ చేసిన నగల విడుదలకు బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో విడుదల చేయాలని ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది.ఇప్పటివరకు Andhra Pradesh Anti-Corruption Bureau నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో విడుదల చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను ఏసీబీ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు.
Read Also: CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో స్వాధీనం చేసుకున్న ఆభరణాలను విడుదల చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఒకవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు జరుగుతుండగా, మరోవైపు నామమాత్రపు పూచికత్తుతో ఆభరణాలు విడుదల చేయడం దర్యాప్తుకు విఘాతం కలిగించే అవకాశం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏసీబీ తరఫు న్యాయవాది శ్యామలరావు వాదనలు వినిపిస్తూ, అవినీతి కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను సులభంగా విడుదల చేయడం వల్ల దర్యాప్తు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. భవిష్యత్తులో సంబంధిత ఉద్యోగులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు తేలితే, వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రభుత్వం పరం అయ్యే అవకాశం ఉంటుందని కూడా వివరించారు.
అలాగే, కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఆభరణాలు అత్యవసరంగా అవసరమైతే, వాటి విలువకు సమానమైన బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుందని ఏసీబీ తరఫు న్యాయవాది కోర్టుకు సూచించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి, విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అవినీతి కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై తాత్కాలికంగా బ్రేక్ పడింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!