AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్ చేసిన నగల విడుదలకు బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో విడుదల చేయాలని ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది.ఇప్పటివరకు Andhra Pradesh Anti-Corruption Bureau నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో విడుదల చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను ఏసీబీ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు.
Read Also: CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ
Also Read
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో స్వాధీనం చేసుకున్న ఆభరణాలను విడుదల చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఒకవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు జరుగుతుండగా, మరోవైపు నామమాత్రపు పూచికత్తుతో ఆభరణాలు విడుదల చేయడం దర్యాప్తుకు విఘాతం కలిగించే అవకాశం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏసీబీ తరఫు న్యాయవాది శ్యామలరావు వాదనలు వినిపిస్తూ, అవినీతి కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను సులభంగా విడుదల చేయడం వల్ల దర్యాప్తు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. భవిష్యత్తులో సంబంధిత ఉద్యోగులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు తేలితే, వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రభుత్వం పరం అయ్యే అవకాశం ఉంటుందని కూడా వివరించారు.
అలాగే, కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఆభరణాలు అత్యవసరంగా అవసరమైతే, వాటి విలువకు సమానమైన బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుందని ఏసీబీ తరఫు న్యాయవాది కోర్టుకు సూచించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి, విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అవినీతి కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై తాత్కాలికంగా బ్రేక్ పడింది.
తాజావార్తలు
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..