నాపై ఆరోపణలు చేస్తే మీ ఇంటికొస్తా: వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచే తాను పోటి చేస్తా అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, టీడీపీ మహిళా నేత సుధారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్దానాలు అవుతాయిని, ఖచ్చితంగా తాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోటీ చేస్తానన్నారు. అవీనితి చేసిన చెవిరెడ్డి చట్టప్రకారం జైలుకు పోతాడన్నారు. చెవిరెడ్డి, ఆయన సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతానని హెచ్చరించారు. చంద్రగిరి టవర్…
గంజాయి సాగును పూర్తి స్థాయిలో అరికడతాం: గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు వచ్చిందని, ఇంకా పూర్తి స్థాయిలో అరికడతాం అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ గంజాయి అరికట్టడంపై దృష్టి పెట్టిందన్నారు. స్కూల్స్, కాలేజీ పిల్లలు గంజాయికి బానిసలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని, జిల్లాల వారీగా వర్క్ షాప్స్ జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు.…
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ధ్వజమెత్తారు. ఎన్టీవీతో హరీశ్రావు మాట్లాడారు. తమ హయాంలో ఎస్ఎల్బీసీ కోసం రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానన్నారు. తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.
ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను అధికారులు ఓపెన్ చేశారు. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని.. అసలు కౌంటింగ్ ప్రక్రియ ఆ తర్వాత మొదలు కానుందని అధికారులు చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి.…
ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2025-26 ఏపీ బడ్జెట్పై చర్చ జరగనుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు లాంటి పూర్తి అంశాలపై చర్చించనున్నారు. మండలిలో బడ్జెట్పై చర్చకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్పులు, సూపర్ సిక్స్ అమలు వంటి వివిధ అంశాలను వైసీపీ సభ్యులు లెవనెత్తె ఆలోచనలో ఉన్నారు. ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి ఫ్లైట్లో 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి జగన్…
చికెన్ మేళాకు అనుహ్య స్పందన: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో అపోహలను తొలగించేందుకు రాజమండ్రిలో చికెన్ మేళాకు అనుహ్య స్పందన లభించింది. చికెన్ వంటకాలను తినడానికి నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. మేళాలో వివిధ రకాల చికెన్ వంటకాలను ఏర్పాటు చేశారు. చికెన్ వంటకాలను ఆరగించడానికి నాన్ వెజ్ ప్రియులు ఎగబడ్డారు. చికెన్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో ఈ చికెన్ మేళాను ఏర్పాటు చేశారు.…
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారని, సంక్షేమం పట్టించుకోవడం లేదని, అభివృధి ఎక్కడా కనిపించడం లేదని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదలకు మంచి చేశారు…
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అలకమీదున్నారా? కూటమి ప్రభుత్వం తనకిచ్చిన నామినేటెడ్ పోస్ట్తో సంతృప్తిగా లేరా? నా రేంజ్ ఏంటి?… నా ర్యాంక్ ఏంటి?… నేను పడ్డ కష్టం ఏంటి? వీళ్ళు నాకు ఇచ్చిన పోస్ట్ ఏంటంటూ… ఫైరైపోతున్నారా? ఏబీవీ విషయంలో ఏం జరుగుతోంది? అసలాయనేం కోరుకుంటున్నారు? ఏబీ వెంకటేశ్వరరావు….2014 టీడీపీ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయి పెత్తనం చెలాయించిన ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్గా కంటే టీడీపీ సానుభూతిపరుడిగానే…
ఆ రెండు ఉమ్మడి జిల్లాలే తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల తలరాతల్ని నిర్ణయించబోతున్నాయా? మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికలు జరిగితే రెండు జిల్లాల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఏవా జిల్లాలు? ఏంటి వాటికున్న ప్రత్యేకత? ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇక ఫలితమే మిగిలి ఉంది. సాధారణ ఎన్నికలను తలపించిన ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది బరిలో ఉండగా రికార్డు స్థాయిలో…
అక్కడ నాయకులంతా మనం మనం బరంపురం అంటున్నారా? పార్టీ ఏదైతేనేం…. రాష్ట్ర స్థాయిలో వాళ్లు ఎలా కొట్టుకుంటే మనకెందుకు? జిల్లాలో మాత్రం కలిసుందామని అనుకుంటున్నారా? ఆగర్భ శతృవుల్లా వ్యవహరించే టీడీపీ, వైసీపీ నాయకులు సైతం ఇక్కడ అంత సీన్ లేదమ్మా అంటున్నారా? ఏ వివాదం తలెత్తినా టీ కప్పులో తుఫాన్లా రెండు రోజుల్లో చల్లారిపోతున్న ఆ జిల్లా ఏది? ఏంటి అక్కడి డిఫరెంట్ రాజకీయం? ఉమ్మడి కర్నూలు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మహామహుల్ని…