రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ‘యువత పోరు’: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైసీపీ సిద్ధమైంది. ‘యువత పోరు’ పేరుతో ధర్నా కార్యక్రమంను నేడు వైసీపీ చేపట్టనుంది. ఈరోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు నాయకులు, కార్యకర్తలు చేయనున్నారు. అనంతరం వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. అంతేకాదు ధర్నాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువతతో కలిసి వైసీపీ పోరుబాకు సిద్ధమైంది. అన్ని…
ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా మండలి సమావేశాలు సాగుతున్నాయి. ఇవాళ విచారణకు రావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు ఇవ్వనుంది. కాకినాడ సీ పోర్టు షేర్లు బదిలీ వ్యవహారంపై విజయ సాయిరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు పార్టీ జెండాను అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు.…
అధికార పార్టీలో ఉంటే చాలు అడ్డగోలు వ్యాపారాలకు లైసెన్స్ వచ్చేసినట్టేనా? ఐదేళ్లు వైసీపీలో ఉండి నానా బీభత్సం చేసిన చేసిన అక్కడి ఊరసవెల్లులు ఇప్పుడు టీడీపీలోకి ఎంటరైపోయి…. పార్టీ ఏదైతేనేం… మనకు మన యాపారం ముఖ్యం అంటున్నారా? పాత, కొత్త టీడీపీ నేతలు కలిసి మెలిసి పంచేసుకుంటున్నారా? ఎక్కడ జరుగుతోందీ దో నంబర్ దందా? ఎవరా రాజకీయ ముసుగు కప్పుకున్న రాబందులు? ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఇసుక, మద్యం దందాలు యమా…
మాటల్లేవ్…. మాట్లాడుకోవడాల్లేవ్….. ముందస్తు చర్చలు అసలే లేవ్….. జస్ట్…అలా వెళ్ళారు… ఇలా ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారు. టోటల్గా… ఒక్క రోజు, ఒకే ఒక్క రోజులో విజయశాంతి అభ్యర్థిత్వం ఖరారైపోయింది. ఆఖరి నిమిషం వరకు సీఎం, పీసీసీ చీఫ్ సహా… తెలంగాణ కాంగ్రెస్లో ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. ఇంతకీ ఏం మ్యాజిక్ చేశారామె? ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్గా ఎట్నుంచి నరుక్కొచ్చారు? తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏం జరిగిందో రకరకాల…
నిలకడలేని రాజకీయం ఆ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కన పడేసిందా? ఆయన అనుభవం, గతాన్ని పరిగణనలోకి తీసుకుంటే… పరిగెత్తుకుంటూ రావాల్సిన అవకాశాలు ఎందుకు రావడం లేదు? ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఆయన వేడుకుంటున్నా… ఆ…. చూద్దాం లే…. అన్నట్టుగా ఎందుకు మారుతోంది? ఎవరా లీడర్? సుదీర్ఘ రాజకీయ అనుభవం పెట్టుకుని… అధికార భాగస్వామ్య పార్టీలో ఉండి కూడా అర్రులు చాచాల్సి రావడానికి కారణాలేంటి? కొత్తపల్లి సుబ్బారాయుడు….. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత. ఉమ్మడి…
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య ఓ వ్యవహారం నువ్వా నేనా అన్నట్టుగా నడిచిందా? ఎమ్మెల్సీ సీటు విషయంలో తండ్రీ కొడుకులిద్దరూ పరస్పరం పట్టుదలకు పోయారా? చివరికి కొడుకే తన పంతం నెగ్గించుకున్నారా? చివరికి కవిత ముందే చెప్పిన పేరు కూడా పక్కకు పోయిందా? ఎమ్మెల్సీ సీటు విషయమై కేసీఆర్, కేటీఆర్ మధ్య ఏం జరిగింది? గులాబీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి…
అక్కడ జనసేన వ్యవహారం ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా మారిపోయింది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిపోయింది. ఉమ్మడి జిల్లా మొత్తం మీద ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఒకవైపు అయితే… మిగతా పార్టీ నాయకులంతా మరో వైపు ఉన్నారట. ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఎక్కడ నడుస్తోంది జనసేన రాజకీయం? పార్టీ అధిష్టానం పట్టించుకుంటుందా? లేక మీ ఖర్మ అని వదిలేస్తుందా? లెట్స్ వాచ్. విజయనగరం జనసేనలో వర్గపోరు పీక్స్కు చేరుతోంది. ఎమ్మెల్యే…
కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కొత్త అవతారం ఎత్తబోతున్నారా? ఆయనకు పాలిటిక్స్ అంటే… విరక్తి కలిగిందా? అందుకే జగ్గన్న 2.0 అని అంటున్నారా? అసలేంటా 2.0? సీనియర్ పొలిటీషియన్ తీసుకున్న సడన్ డెసిషన్ ఏంటి? దాని రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ పాలిటిక్స్ చేసే అతికొద్ది మంది నాయకుల్లో జగ్గారెడ్డి ఒకరు. అలాంటి లీడర్కి ఇప్పుడు రాజకీయాల మీద విరక్తి కలిగిందా? అన్న ప్రశ్న చక్కర్లు కొడుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. ఆయన పాలిటిక్స్ నుంచి…
మద్య నిషేధంపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదు: మద్య నిషేధంపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో నాసిరకం మద్యంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారన్నారు. బెల్టు దుకాణాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, నాసిరకమైన 29 మద్యం బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశాం అని తెలిపారు. తాగేవాళ్లను ఒక్కసారిగా మార్చలేమని, ఇది క్రమేపీ జరగాల్సిన ప్రక్రియ అని…
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్: ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ వేయనున్నారు. కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను పార్టీ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. కొణిదెల నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10…