CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- మేడారంలో సమ్మక్క-సారలమ్మకు సీఎం ప్రత్యేక పూజలు
- ములుగులో రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభం
- రూ.63.50 కోట్లతో నూతన కలెక్టరేట్ ప్రారంభం
- పరకాలకు రూ.484 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ములుగు, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల ఆశీస్సులు తీసుకుని, రూ. వందల కోట్ల వ్యయంతో సిద్ధమైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రి సీతక్క నేతృత్వంలో అధికారులు, పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మేడారం వనదేవతల దర్శనం.. ములుగులో రూ.868 కోట్ల అభివృద్ధి పనులు
సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం, మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్లో మేడారం చేరుకోనున్న రేవంత్ రెడ్డి, సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం చేయూత పింఛనుదారులకు మంజూరు పత్రాల పంపిణీతో పాటు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ములుగు చేరుకుని, గట్టమ్మ ఆలయ సమీపంలో రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల (హ్యామ్ రోడ్ల) అభివృద్ధికి సూచికగా ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరిస్తారు. దానితో పాటు రూ.868 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ పైలాన్తో పాటు, రూ.63.50 కోట్ల నిధులతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల (కలెక్టరేట్) సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
Also Read
- Harish Rao : రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
- CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
- CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్కు సవాల్.!
పరకాలకు వరాల జల్లు.. రూ. 484.42 కోట్లతో భారీ శంకుస్థాపనలు
ములుగు పర్యటన పూర్తి చేసుకుని మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. పరకాల మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ సమగ్ర స్వరూపాన్ని మార్చేలా మొత్తం రూ. 484.42 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పరకాల పట్టణంలో తాగునీటి సరఫరా, అంతర్గత డ్రైనేజీ రోడ్లు, ఆసుపత్రి భవనం, డిగ్రీ కళాశాల , విద్యుత్ సబ్స్టేషన్లతో పాటు సమీప ప్రాంతాలలో ఫోర్ లేన్ రహదారి నిర్మాణం, ఉర్దూ ఘర్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ , అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అంతేకాకుండా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ సీఎం ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
-
OTR: జడ్చర్ల రాజకీయాల్లో రచ్చ.. ఈ పబ్లిసిటీ స్టంట్ వెనుక ఎవరున్నారు..?
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!