నగరంలో రోజు రోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళ రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. పటిష్ట నిఘా ఉన్నా.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టిన.. పోలీస్ యంత్రాంగా 24 గంటలు అలర్ట్ గా ఉన్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలు.. లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయి. గుడిలోనూ, బడిలోనూ, ఆస్పత్రుల్లోనూ మహిళలకు రక్షణ లేకుండో పోతోంది. మైనర్ నుంచి ముసలి వయసు వరకు.. మహిళ అంటే చాలు కిరాతకులు రెచ్చిపోతున్నారు. కామవాంఛలతో…
నిజామాబాద్ GGH ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. డాక్టర్స్ రెస్ట్ రూమ్ లో డాక్టర్ శ్వేతా అనుమానాస్పద మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. రాత్రి వరకు డ్యూటీ లో ఉన్న మహిళా డాక్టర్ ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హాస్పిటల్ సూపరిండెంట్ మీడియాను లోపాలకి అనుమతించకపోవడంతో.. పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. మరో నెల…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిషేధిత గుట్కా, జర్దాను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కెఆర్ నాగరాజు వివరాలు వెల్లడించారు. కొందరు సమాచారం ఇవ్వడంతో.. టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ల అధ్వర్యంలో లైన్ గల్లీలో దాడులు నిర్వహించామని తెలిపారు. నిర్వాహకులు మహమ్మద్ అబుబకర్, షేక్ నేహల్ ఇద్దరి కిరాణషాప్, గోదాంలలో నిషేధిత గుట్కా జర్దాను సీజ్ చేసినట్లు…
సూటిగా సుత్తి లేకుండా కామెంట్ చేసేశారు TRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మూడేళ్ల గ్యాప్ తర్వాత పదునైన విమర్శలతో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై విరుచుకుపడ్డారు. ఇందూరులో పసుపు రాజకీయాన్ని వేడెక్కించడంతోపాటు.. వచ్చే లోక్సభ ఎన్నికల వరకు నిజామాబాద్లో పొలిటికల్ గేర్ మార్చినట్టు చెప్పకనే చెప్పేశారు కవిత. 2019 ఎన్నికల తర్వాత అనేక పర్యాయాలు కవిత నిజామాబాద్లో పర్యటించినా.. ఎంపీ అరవింద్పై ఈ స్థాయిలో విరుచుకుపడింది లేదు. ఈ మాటల తూటాలు చూశాక రాజకీయ వర్గాల్లో…
నగరంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉక్కపోతతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి సిటీ ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగలతో నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. రోజుకు సగటున 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత…
అంబులెన్స్ లో పశువులను తరలించిన కేసులో ఐదుగురు నిందితుల్ని నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు వ్యక్తులు వున్నట్టు పోలీసులు తెలిపారు. వీరినుంచి 5 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు. ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు తెలిపారు. రెంజల్ మండలం శాటాపూర్ సంతలో పశువులు కొనుగోలు చేశారు. హైద్రాబాద్ లో అంబులెన్స్ ను తయారు చేయించారు. వేడి వల్ల రాపిడికి అంబులెన్స్ లో మంటలు…
రాష్ట్రంలో రాహుల్గాంధీ పర్యటన తర్వాత.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో కీలక మార్పులకు PCC కార్యాచరణ సిద్ధం చేస్తుందని టాక్. అందులో ముఖ్యమైంది జిల్లాలకు కొత్త కాంగ్రెస్ సారథుల నియామకం. పార్టీలో సీనియర్ నేతలు.. మాజీ ఎమ్మెల్యేలను డీసీసీలుగా చేస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకంలో ఇదే చేసింది. ఆ ఫార్ములానే కాంగ్రెస్ కూడా ఫాలో అవుతుందనేది టాక్. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ విప్…
కేసీఆర్ ఆహ్వానంతో టీఆర్ఎస్లో చేరిక మండవ వెంకటేశ్వరరావు. మాజీ మంత్రి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ.. నాటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. నాటి రాజకీయాల్లో మండవ పేరు ప్రముఖంగా వినిపించేది. జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు టీడీపీలో ఉన్న ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల ముందు అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరారు మండవ. అప్పట్లో సీఎం కేసీఆర్ స్వయంగా మండవ…
తన సెల్ ఫోన్ స్నేహితుడు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఒకరు చనిపోగా… బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించలేక మరో స్నేహితుడు మనోవేదనతో ఉరేసుకొన్నాడు. ఫోన్ విషయంలో తలెత్తిన వివాదం ఇరువురి మధ్య చిచ్చురేపింది. క్షణికావేశంలో తీసుకొన్న నిర్ణయాలతో రెండు కుటుంబాలకు తీరని వేదన మిగిలింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ చెందిన నీరడి మహేష్, రాచకొండ సాయిలు స్నేహితులు. ఈ నెల 12న వీరిద్దరు కలిసి నస్రుల్లాబాద్లో జరిగిన…
హనుమాన్ శోభాయాత్రలో బీజేపీ నేతల మధ్య కొనసాగుతోన్న వర్గపోరు బహిర్గతం అయ్యింది.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా బీజేపీ నాయకుల మధ్య వర్గ పోరు బయటపడింది.. గత కొద్ది కాలంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బీజేపీలో కొనసాగుతున్న వర్గ పోరుకు వేదికగా మారింది హనుమాన్ శోభయాత్ర. నిజామాబాద్ ఎంపీ వచ్చిన తర్వాతే శోభాయాత్రను ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనపాల్ సూర్యనారాయణ పట్టుబట్టగా… లేదు, షెడ్యూల్ ప్రకారం శోభాయాత్రను…