రాష్ట్రంలో రాహుల్గాంధీ పర్యటన తర్వాత.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో కీలక మార్పులకు PCC కార్యాచరణ సిద్ధం చేస్తుందని టాక్. అందులో ముఖ్యమైంది జిల్లాలకు కొత్త కాంగ్రెస్ సారథుల నియామకం. పార్టీలో సీనియర్ నేతలు.. మాజీ ఎమ్మెల్యేలను డీసీసీలుగా చేస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకంలో ఇదే చేసింది. ఆ ఫార్ములానే కాంగ్రెస్ కూడా ఫాలో అవుతుందనేది టాక్. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ విప్…
కేసీఆర్ ఆహ్వానంతో టీఆర్ఎస్లో చేరిక మండవ వెంకటేశ్వరరావు. మాజీ మంత్రి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ.. నాటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. నాటి రాజకీయాల్లో మండవ పేరు ప్రముఖంగా వినిపించేది. జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు టీడీపీలో ఉన్న ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల ముందు అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరారు మండవ. అప్పట్లో సీఎం కేసీఆర్ స్వయంగా మండవ…
తన సెల్ ఫోన్ స్నేహితుడు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఒకరు చనిపోగా… బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించలేక మరో స్నేహితుడు మనోవేదనతో ఉరేసుకొన్నాడు. ఫోన్ విషయంలో తలెత్తిన వివాదం ఇరువురి మధ్య చిచ్చురేపింది. క్షణికావేశంలో తీసుకొన్న నిర్ణయాలతో రెండు కుటుంబాలకు తీరని వేదన మిగిలింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ చెందిన నీరడి మహేష్, రాచకొండ సాయిలు స్నేహితులు. ఈ నెల 12న వీరిద్దరు కలిసి నస్రుల్లాబాద్లో జరిగిన…
హనుమాన్ శోభాయాత్రలో బీజేపీ నేతల మధ్య కొనసాగుతోన్న వర్గపోరు బహిర్గతం అయ్యింది.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా బీజేపీ నాయకుల మధ్య వర్గ పోరు బయటపడింది.. గత కొద్ది కాలంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బీజేపీలో కొనసాగుతున్న వర్గ పోరుకు వేదికగా మారింది హనుమాన్ శోభయాత్ర. నిజామాబాద్ ఎంపీ వచ్చిన తర్వాతే శోభాయాత్రను ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనపాల్ సూర్యనారాయణ పట్టుబట్టగా… లేదు, షెడ్యూల్ ప్రకారం శోభాయాత్రను…
అభం శుభం తెలియని మైనర్ బాలికలు అన్యాయానికి గురవుతున్నారు. తెలిసి తెలియని వయస్సులో కొందరు తప్పుచేస్తే.. మరికొందరు మోసపూరిత మాటలకు బలైపోతున్నారు.. ఆర్దిక ఇబ్బందులు, సమాజం పట్ల అవగాహనా రాహిత్యం, ఆధునిక ప్రపంచం పట్ల మక్కువ, అరచేతిలో ఇంటర్ నెట్ బాలికలను చిన్న వయస్సులోనే మోసపోయేలా.. మరికొందరు తప్పుదారి పట్టేలా చేస్తుంది. మోసమైనా, మోజైనా అంతిమంగా బాలికలే నష్టపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న మైనర్ బాలికల అత్యాచార ఘటనలు సభ్య సమాజాన్ని…
దిష్టికి మన సమాజంలో ఎనలేని విలువ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఇంటిముందు దిష్టిబొమ్మ కట్టడం, ఏదైనా పని ప్రారంభించినా గుమ్మడికాయను పగులగొట్టి దిష్టి లేకుండా చూసుకోవడం… దిష్టేమైనా తగిలిందేమోనని దిష్టిమంత్రాలు, యంత్రాలు వేయించడం సర్వసాధారణం. ఇలా దిష్టికి ఎనలేని ప్రాధాన్యత ఉంది మన సమాజంలో నరదిష్టంటే అంతకు మించి భయం వుంటుంది. అందుకే ఓ రైతు తన పంటకు దిష్టి తగలకుండా మనుషుల నుండి పక్షుల నుండి రక్షించుకునేందుకు వినూత్న పద్ధతి…
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్బుతం అని అంతా కొనియాడారు. కోటి ఎకరాలకు సాగునీరు అత్యద్భుతం, ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా… ఆ ప్యాకేజీలో భాగంగా చేపడుతున్న రిజర్వాయర్ సామర్ధ్యం పెంపు ఆగ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. యువకులు ఉపాధి కూడా కోల్పోతున్నారు. రిజర్వాయర్ సామర్ధ్యం పెంపు నిర్ణయంతో పోరుబాటకు సిద్దం అవుతున్నారు రైతులు. ఆ రిజర్వాయర్ నిర్మాణంతో ఊళ్లో పెళ్ళి కాని ప్రసాదులు…
మనదేశం వివిధ పండుగలు, వేడుకలు, సంప్రదాయాలు, ఆటలకు వేదిక. హోళీ పండగ అందరికీ రంగుల పండగ. కులమతాలకు అతీతంగా అందరూ కలసి రంగులు జల్లుకుని ఆనందంగా జరుపుకునే పండగ. కానీ అక్కడ హోళీ అంటే పిడిగుద్దులకు ప్రత్యేకం. జనం రెండు వర్గాలుగా విడిపోయి కొద్దిసేపు పిడిగుద్దులు గుద్దుకుంటారు. ఆతరువాత అందరూ ఆనందంగా అలయ్ బలయ్ చేసుకుంటారు. రంగులు జల్లుకొమ్మంటే పిడిగుద్దులు ఎందుకు అని అంటే అది తరతరాలుగా వస్తున్న మా సాంప్రదాయం అని చెబుతున్నారు వారు. కొన్నేళ్లుగా…
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటనలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.. ఇక, కొన్ని సందర్భాల్లో బీజేపీ ప్రజా ప్రతినిధుల పర్యటనలను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్న సందర్భాల్లో కూడా ఉన్నాయి.. కొన్ని సార్లు, దాడులు, ప్రతిదాడులకు కూడా దారితీశాయి.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు…
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం పర్యటన పెద్ద రచ్చగా మారింది.. అర్వింద్ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుని, దాడికి తెగబడ్డాయి.. బీజేపీ నేతలు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో అర్వింద్ కారుతోపాటు ఐదు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు బీజేపీ నేతలు, కార్య కర్తలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఫోన్ చేసి ఆరా తీశారు.. ఆర్మూర్లో టీఆర్ఎస్…