Nizamabad:కాళ్లు, చేతులు కట్టి, నోట్లో బట్ట కుక్కి మహిళపై అఘాయిత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో రోజు రోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళ రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. పటిష్ట నిఘా ఉన్నా.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టిన.. పోలీస్ యంత్రాంగా 24 గంటలు అలర్ట్ గా ఉన్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలు.. లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయి.
గుడిలోనూ, బడిలోనూ, ఆస్పత్రుల్లోనూ మహిళలకు రక్షణ లేకుండో పోతోంది. మైనర్ నుంచి ముసలి వయసు వరకు.. మహిళ అంటే చాలు కిరాతకులు రెచ్చిపోతున్నారు. కామవాంఛలతో మానభంగాలకు పాల్పడుతున్నారు. తరచూ ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. తాజాగా జరిగిన ఓ ఘటన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఓ మహిళను కాళ్లు, చేతులు కట్టి, నోట్లో బట్ట కుక్కి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
ఇక వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మహంతంలో దారుణం చోటుచేసుకుంది. కాళ్ళు చేతులు కట్టి, నోట్లో బట్టని కుక్కి మహిళపై ముగ్గురు వ్యక్తుల అత్యాచార యత్నం చేశారు దుండగులు. మహిళ తేరుకుని డయల్ 100కు కాల్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను కాపాడారు. కేసు నమోదు చేసుకుని ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
కాగా.. 28 ఏప్రిల్ 2022 నిజామాబాద్ జిల్లాలో బాలికపై అఘాయిత్యం జరిగింది. మతిస్థిమితంలేని బాలికపై పెదనాన్న, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పెదనాన్న ఇంట్లో బాలిక ఉంటుంది. బాలికపై పలుమార్లు పెదనాన్న, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాపోతుంది. ప్రస్తుతం ఆ బాలిక 8 నెలల గర్భవతిగా ఉంది. జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అయితే.. ఆంధ్రప్రదేశ్ రేపల్లె రైల్వే స్టేషన్లో మే 1న ఓ మహిళను గ్యాంగ్ రేప్ చేశారు. భర్తను కొట్టి భార్యను లాక్కెళ్లిన మృగాళ్లు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూలీ పనుల కోసం బాధితురాలి కుటుంబం ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా నాగాయలంకకు వెళ్తున్నారు. రాత్రి రేపల్లె స్టేషన్లో రైలు దిగిన తరువాత.. ఒకటో నెంబర్ ఫ్లాట్ఫామ్పై పడుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు మహిళను ఫ్లాట్ఫామ్ చివరకు లాక్కెళ్లి అత్యాచారం చేశారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!