Nizamabad:కాళ్లు, చేతులు కట్టి, నోట్లో బట్ట కుక్కి మహిళపై అఘాయిత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో రోజు రోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళ రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. పటిష్ట నిఘా ఉన్నా.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టిన.. పోలీస్ యంత్రాంగా 24 గంటలు అలర్ట్ గా ఉన్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలు.. లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయి.
గుడిలోనూ, బడిలోనూ, ఆస్పత్రుల్లోనూ మహిళలకు రక్షణ లేకుండో పోతోంది. మైనర్ నుంచి ముసలి వయసు వరకు.. మహిళ అంటే చాలు కిరాతకులు రెచ్చిపోతున్నారు. కామవాంఛలతో మానభంగాలకు పాల్పడుతున్నారు. తరచూ ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. తాజాగా జరిగిన ఓ ఘటన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఓ మహిళను కాళ్లు, చేతులు కట్టి, నోట్లో బట్ట కుక్కి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
Also Read
- Road Accidents: తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం..
- Hyderabad: ఫ్రీజర్లో పురుగులు, స్టోరేజ్లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
- Kakatia Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
- DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
ఇక వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మహంతంలో దారుణం చోటుచేసుకుంది. కాళ్ళు చేతులు కట్టి, నోట్లో బట్టని కుక్కి మహిళపై ముగ్గురు వ్యక్తుల అత్యాచార యత్నం చేశారు దుండగులు. మహిళ తేరుకుని డయల్ 100కు కాల్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను కాపాడారు. కేసు నమోదు చేసుకుని ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
కాగా.. 28 ఏప్రిల్ 2022 నిజామాబాద్ జిల్లాలో బాలికపై అఘాయిత్యం జరిగింది. మతిస్థిమితంలేని బాలికపై పెదనాన్న, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పెదనాన్న ఇంట్లో బాలిక ఉంటుంది. బాలికపై పలుమార్లు పెదనాన్న, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాపోతుంది. ప్రస్తుతం ఆ బాలిక 8 నెలల గర్భవతిగా ఉంది. జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అయితే.. ఆంధ్రప్రదేశ్ రేపల్లె రైల్వే స్టేషన్లో మే 1న ఓ మహిళను గ్యాంగ్ రేప్ చేశారు. భర్తను కొట్టి భార్యను లాక్కెళ్లిన మృగాళ్లు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూలీ పనుల కోసం బాధితురాలి కుటుంబం ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా నాగాయలంకకు వెళ్తున్నారు. రాత్రి రేపల్లె స్టేషన్లో రైలు దిగిన తరువాత.. ఒకటో నెంబర్ ఫ్లాట్ఫామ్పై పడుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు మహిళను ఫ్లాట్ఫామ్ చివరకు లాక్కెళ్లి అత్యాచారం చేశారు.
తాజావార్తలు
-
Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
-
Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
-
OnePlus Pad 3 Pro: వన్ప్లస్ ప్యాడ్ 3 ప్రో టాబ్లెట్ విడుదల.. 13,380mAh బ్యాటరీ, 16GB RAM
ట్రెండింగ్
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!