Cows Burnt Case: పశువుల తరలింపు కేసు.. ఐదుగురి అరెస్ట్
అంబులెన్స్ లో పశువులను తరలించిన కేసులో ఐదుగురు నిందితుల్ని నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు వ్యక్తులు వున్నట్టు పోలీసులు తెలిపారు. వీరినుంచి 5 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు. ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు తెలిపారు.
రెంజల్ మండలం శాటాపూర్ సంతలో పశువులు కొనుగోలు చేశారు. హైద్రాబాద్ లో అంబులెన్స్ ను తయారు చేయించారు. వేడి వల్ల రాపిడికి అంబులెన్స్ లో మంటలు వ్యాపించాయి. దీంతో 13 పశువులు సజీవ దహనమయ్యాయి. పశువులను బంధించి తీసుకెళ్లడం నేరం. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగిందంటే….
Also Read
గత కొంతకాలంగా పశువులను కొని వాటిని కబేళాలకు తరలిస్తుంటారు. ఇదంతా అక్రమంగా సాగుతుంటుంది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి తన వాహనాన్ని అంబులెన్సుగా మార్చారు. అందులో మూగజీవాలను అక్రమంగా తరలిస్తుండేవారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మాక్లూర్ తండా వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి అంబులెన్సు దగ్ధమైన ఘటనలో 13 ఎద్దులు సజీవ దహనం అయ్యాయి. కాలిపోయిన కోడెద్దులను అటవీ ప్రాంతంలో ఖననం చేశామన్నారు. రెంజల్ మండలం సాటాపూర్ పశువుల సంతలో వాటిని కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్లో తనిఖీలు కట్టుదిట్టం చేయడంతో ఎద్దుల తరలింపునకు అక్రమ మార్గాలు అనుసరించారు. ద్దుల అకాల మరణానికి కారణమైన ఎనిమిది మందిపై ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు సీపీ చెప్పారు. ఈ ఘటనను ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. చెక్పోస్టుల వద్ద భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Yesterday night, 10 cows were transported to Slaughterhouse in 'Ambulance' from Nizamabad to Hyderabad, 8 cows were burnt alive in the ambulance and the driver is on the run.@TelanganaDGP should immediately act against the people behind this. pic.twitter.com/O8BYNlmVxn
— Raja Singh (@TigerRajaSingh) May 1, 2022
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో