Cows Burnt Case: పశువుల తరలింపు కేసు.. ఐదుగురి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబులెన్స్ లో పశువులను తరలించిన కేసులో ఐదుగురు నిందితుల్ని నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు వ్యక్తులు వున్నట్టు పోలీసులు తెలిపారు. వీరినుంచి 5 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు. ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు తెలిపారు.
రెంజల్ మండలం శాటాపూర్ సంతలో పశువులు కొనుగోలు చేశారు. హైద్రాబాద్ లో అంబులెన్స్ ను తయారు చేయించారు. వేడి వల్ల రాపిడికి అంబులెన్స్ లో మంటలు వ్యాపించాయి. దీంతో 13 పశువులు సజీవ దహనమయ్యాయి. పశువులను బంధించి తీసుకెళ్లడం నేరం. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగిందంటే….
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
గత కొంతకాలంగా పశువులను కొని వాటిని కబేళాలకు తరలిస్తుంటారు. ఇదంతా అక్రమంగా సాగుతుంటుంది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి తన వాహనాన్ని అంబులెన్సుగా మార్చారు. అందులో మూగజీవాలను అక్రమంగా తరలిస్తుండేవారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మాక్లూర్ తండా వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి అంబులెన్సు దగ్ధమైన ఘటనలో 13 ఎద్దులు సజీవ దహనం అయ్యాయి. కాలిపోయిన కోడెద్దులను అటవీ ప్రాంతంలో ఖననం చేశామన్నారు. రెంజల్ మండలం సాటాపూర్ పశువుల సంతలో వాటిని కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్లో తనిఖీలు కట్టుదిట్టం చేయడంతో ఎద్దుల తరలింపునకు అక్రమ మార్గాలు అనుసరించారు. ద్దుల అకాల మరణానికి కారణమైన ఎనిమిది మందిపై ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు సీపీ చెప్పారు. ఈ ఘటనను ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. చెక్పోస్టుల వద్ద భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Yesterday night, 10 cows were transported to Slaughterhouse in 'Ambulance' from Nizamabad to Hyderabad, 8 cows were burnt alive in the ambulance and the driver is on the run.@TelanganaDGP should immediately act against the people behind this. pic.twitter.com/O8BYNlmVxn
— Raja Singh (@TigerRajaSingh) May 1, 2022
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!