ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. నేడు రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల నిరసన చేపట్టారు.
తెలంగాణలో మరో కొత్త మండలం ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో మండల కేంద్రంగా పోతంగల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేసన్ జారీ చేసింది.
ఇవాళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాల కేసులో ఎన్ఐఏ ఎదుట విచారణకు 10 మంది యువకులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అయితే.. పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాల ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తూ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తోందనే అభియోగాలతో నిన్న (ఆదివారం) ఎన్ఐఏ విస్తృత దాడులు నిర్వహించింది. ఈనేపథ్యంలో.. నిజామాబాద్ లో 23, హైదరాబాద్ లో 4, జగిత్యాలలో 7, నిర్మల్ లో 2, ఆదిలాబాద్, కరీంనగర్ లలో ఒక్కో ప్రాంతం,…
NIA inspections: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపింది.. నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, కడపా, గుంటూరులో ఎన్ఐఏ రైడ్స్ నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే.. పీపుల్స్ ఫ్రంట్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీసింది. ఇక ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ నిర్వహిస్తున్నారు. అయితే.. ఒక్క నిజామాబాద్లోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.…
Muslim Woman Translated Bhagavad Gita : దేనికైనా మతంతో సంబంధం వుండదు. అందరూ సమ్మతమే. మనం అనే భావన మనందరిలో వుంది కాబట్టే మన మందరం భారతీయులం. కులం, మతం వేరేమి కాదు. కులమతాలకు అతీతంగా అందరూ దేవుడికి సమానమే. ఏ పండగ వచ్చినా అందరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకుంటుంటారు. అదే మన భారత దేశం. అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగుతూ మనుషులంతా ఒక్కటే.. కులం, మతం అనే తేడా లేదంటూ కలిసి…
Telangana VC Ravinder Gupta Stucks in Another Dispute in Nizamabad: నిజామాబాద్ జిల్లా లోని తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న గణేష్ నిమజ్జనం తర్వాత, గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి ఆయన నృత్యాలు చేశారు. అంతేకాదు గర్ల్స్ పై వీసీ డబ్బులు ఎగురవేస్తూ, డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గర్ల్స్ హాస్టల్ లో అనుమతి లేకుండా వీసీతో పాటు…
కేవలం హోం వర్క్ చేయలేదనే ఒకేఒక్క కారణంతో టీచర్ వేసిన శిక్షకు ఆచిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. నిజామాబాద్ జిల్లా లోని వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో చోటుచేసుకున్న ఈఘటన ప్రతిఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అర్సపల్లికి చెందిన ఫాతిమాకు 7ఏండ్లు. ఫాతిమా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్డు ఎన్ఆర్ఐ కాలనీలో ఉన్న వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో రెండోతరగతి చదువుతోంది. సెప్టెంబర్ 3న ఫాతిమా హోంవర్క్ చేయలేదని టీచర్ కోప్పడింది. ఆమెను తరగతి గదిలో సుమారు గంట పాటు బెంచీపై…