Telangana VRA: VRAల నిరసనగళం.. MRO ఆఫీసులకు తాళాలు, నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana VRA: సెప్టెంబర్ 12న శాసన సభలో కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో VRA లు ఆందోళన చేపట్టారు. Pay స్కెల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం సరిపోవడం లేదని నిరసన వ్యక్తం చేసారు. అయితే.. వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీలోని కమిటీ హాల్లో 15 మంది వీఆర్ఏలతో సెప్టెంబర్ 13న కేటీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. వీఆర్ఏల ప్రతినిధులతో శాసనసభ ప్రాంగణంలో డిమాండ్లపై మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. అర్హులైన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని వీఆర్ఏలు కోరారు. సెప్టెంబర్ 20న మరోసారి చర్చిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో.. వీఆర్ఏలు ఆందోళన విరమించారు.
అయితే ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. నేడు రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల నిరసన చేపట్టారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్ఏలు నిరసన చేపట్టారు. జిల్లాల్లో కార్యాలయం ముందు వారిడ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
Read also: Arya 34: ఆర్య, సిద్ది ఇద్నాని జంటగా సినిమా ప్రారంభం
రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు జిల్లాల వారీగా వీఆర్ఏల నిరసనలు:
సంగారెడ్డి జిల్లా పఠాటాన్చెరు తహశీల్దార్ కార్యాలయం ముందు VRA ల నిరసన చేపట్టారు. కార్యాలయానికి తాళం తీయకుండా VRAలు అడ్డుకొని నిరసన తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం గేట్లు మూసివేసి వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. ఎమ్మార్వో ఆఫీస్ అధికారులను కార్యాలయంలోకి వెళ్లకుండా వీఆర్ఏలు అడ్డుకున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం తాహసిల్దార్ కార్యాలయాన్ని వీఆర్ఏలు దిగ్బంధం చేశారు. తహశీల్దార్ ఆఫీస్ గేటుకు తాళం వేసి వీఆర్ఏలు నిరసన తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించాలనీ 78 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లను పరిష్కరించాలని నిరసన చేపట్టారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళన ఉదృతం చేశారు. తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి వీఆర్ఏలు నిరసన చేపట్టారు. బోధన్, ఆర్మూర్, బాన్స్ వాడా, నిజమాబాద్ లో తహసీల్దార్ గేటు ముందు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నిరసన చేపట్టారు.
నిజమాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏల ఆందోళన ఉదృతం చేశారు. తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసిన వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. బోధన్, ఆర్మూర్, బాన్స్ వాడా, నిజమాబాద్ లో తహసీల్దార్ గేటు ముందు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు.
Atchannaidu: డైవర్షన్ పాలిటిక్స్ జగన్ కు అలవాటే
- Tags
- kcr
- ktr
- mro
- Nizamabad
- patancheru
తాజావార్తలు
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!