Raja Singh: పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోం…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కసారి పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని ప్రకటించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ఐదో రోజు కొనసాగుతున్న ప్రజాగోస – బీజేపీ భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు… ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అవినీతి చిట్టాలతో బ్లాక్మెయిల్ చేసి పార్టీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు.. అవినీతి అక్రమాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేరాఫ్ అడ్రస్ గా మారారని విమర్శించారు.. ఎమ్మెల్యే వారి అనుచరులు అవినీతికి పాల్పడితే చూసి చూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.. రాష్ట్రంలో భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లితే సీఎం కేసీఆర్.. ఏరియల్ సర్వే కె పరిమితం అయ్యారని మండిపడ్డారు.. పంట నష్టపోయిన రైతులకు ఆదుకునే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Shivshankar Wife Protest: నిత్య పెళ్ళికొడుకు సొంతూళ్ళో భార్య ఝాన్సీ నిరసన
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఇక, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి, గెలుపు గుర్రాలకు మాత్రమె ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని స్పష్టం చేసిన ఆయన.. పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని స్పష్టం చేశారు.. వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని వ్యాఖ్యానించారు రాజా సింగ్. కాగా, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. తాజాగా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్టీలో చేరగా.. త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చేరతారనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు చాలా మంది తమతో టచ్లో ఉన్నారని చెబుతున్నారు బీజేపీ నేతలు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!