ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ యువతిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వలలో పడేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు రాహుల్. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
Narendra Modi: ప్రజాకవి గద్దర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కాగా గద్దర్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి తానెంతో బాధపడ్డానని ఆయన భార్య విమలకు మోడీ లేఖ రాశారు. తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్ కుటుంబానికి మోడీ సానుభూతిని తెలియజేశారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని మోడీ లేఖలో తెలిపారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన…
7వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు. దీంతో విద్యార్థి తరగతి గదిలోనే స్పృహతప్పి పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చిన్నారి గుండెలోని మృదు కణజాలంలో గాయం ఉందని వైద్యులు చెబుతున్నారు.
మిజోరంలోని కురుంగ్ నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది చనిపోయారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మే 9న జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసి దర్యాప్తు చేసేందుకు పాక్ కోర్టు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది.
చంద్రయాన్-3 విజయవంతంపై యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందనలు తెలిపారు. భారత్ చరిత్రను సృష్టిస్తూనే ఉందని X (ట్విట్టర్) లో తెలిపారు.
Vande Bharat Express: వందే భారత్ రైళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వల్ల ప్రయాణ కాలం తగ్గుతుంది. అయితే ఈ రైలులో ఫీచర్లను ఎప్పటికప్పుడు ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా అప్ గ్రేడ్ చేస్తోంది రైల్వేశాఖ. ఇక కొత్తగా రూపొందిస్తున్న వందేభారత్ రైళ్లలో సాంకేతికతను ఉపయోగించి ప్రమాదాలను తగ్గించాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. దీని కోసం విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ సదుపాయాన్ని వందేభారత్ రైలులో కూడా కల్పిస్తోంది. కొత్తగా రూపొందిస్తున్న వందే భారత్లో…
సకాలంలో ఎన్నికలు నిర్వహించనందుకు ప్రపంచ రెజ్లింగ్ అపెక్స్ బాడీ UWW రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)ని గురువారం సస్పెండ్ చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇది దేశానికి ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ జిల్లాలో టమాటాలను ఎత్తుకెళ్లిన ఉదంతం తెరపైకి వచ్చింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టమోటాలతో ఉన్న వాహనంలోని డ్రైవర్ను కొట్టి తీసుకెళ్లారు.