Vande Bharat Express: కొత్త వందేభారత్ రైళ్లలో అదిరిపోయే ఫీచర్స్.. విమానంలో లాగా బ్లాక్ బాక్స్ కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: వందే భారత్ రైళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వల్ల ప్రయాణ కాలం తగ్గుతుంది. అయితే ఈ రైలులో ఫీచర్లను ఎప్పటికప్పుడు ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా అప్ గ్రేడ్ చేస్తోంది రైల్వేశాఖ. ఇక కొత్తగా రూపొందిస్తున్న వందేభారత్ రైళ్లలో సాంకేతికతను ఉపయోగించి ప్రమాదాలను తగ్గించాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. దీని కోసం విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ సదుపాయాన్ని వందేభారత్ రైలులో కూడా కల్పిస్తోంది. కొత్తగా రూపొందిస్తున్న వందే భారత్లో సీసీఆర్వీసీ అనే రైలులో విమానంలోని బ్లాక్బాక్స్ తరహా సాంకేతికత ఉండనుంది. ఈ వందేభారత్ కొత్త కోచ్ లను బెంగాల్ లోని చిత్తిరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. అనంతరం వాటిని చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సెప్టెంబర్ లో పరీక్షించనున్నారు.
ఈ బ్లాక్ బాక్స్ లోకో పైలట్ కదలికలను గమనిస్తుంది. ఆడియో, వీడియోలను రికార్డు చేస్తుంది. దీని వల్ల ఎప్పుడైన రైలు ఏదైనా ప్రమాదానికి గురైతే ఈ బ్లాక్బాక్స్లోని సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవచ్చు. అలాంటి వేరే రైళ్లలో జరగకుండా చూసుకోవడానికి వీలుంటుంది. ఇక కొత్తగా రూపొందిస్తున్న వందేభారత్ రైలులో అనేక కొత్త ఫీచర్ లు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న డిస్క్ బ్రేక్ సిస్టమ్. దీని కారణంగా ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ప్రయాణిస్తే ఆటోమేటిక్ గా అవి ఆగిపోతాయి. ఇక కొత్తగా రూపొందించే రైళ్లలో రెండు ఇంజన్లు ఉంటాయి. అందువల్ల ముందుకు, వెనక్కు ప్రయాణించగలుగుతుంది. రెండు ఇంజన్లను ఒక పైలెట్ మాత్రమే నియంత్రించేలా చేస్తున్నారు. ఇక మరో ఫిచర్ ఆధునిక సాంకేతికతతో కూడిన ఎయిర్ కండిషన్ డ్రైవర్ క్యాబిన్. అయితే, ఈ క్యాబిన్లో టాయిలెట్ సౌకర్యం లేదు. ఇక రీసెంట్ గానే తెల్ల రంగు ఉన్న కారణంగా ఎక్కువ మురికి కనిపిస్తుందనే కారణంతో వందేభారత్ రైళ్ల రంగును కాషాయ రంగులోకి మార్చిన సంగతి తెలిసిందే. ఇక పైన చెప్పిన ఫీచర్లన్నీ కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణీకులు మరింత సురక్షితంగా ఈ వందేభారత్ రైళ్లలో ప్రయాణించవచ్చు. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న ఇవి త్వరలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి.
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!