Mizoram: మిజోరాంలో వంతెన కూలిపోయిన బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిజోరంలోని కురుంగ్ నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది చనిపోయారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ విషయాన్ని ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సబ్యసాచి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది అని సబ్యసాచి చెప్పారు.
Read Also: Student Suicide: కాలేజీలోని వాష్రూమ్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
Also Read
మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం తెలిపాడు. మృతుల బంధువులకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్తంగా మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్లో సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Baby: మూవీ లవర్స్ కి అలర్ట్.. బేబీ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది..
రాజధాని నగరం ఐజ్వాల్కు 21కి.మీ దూరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతోన్న సమయంలో ఈ వంతెన కూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో మొత్తం 28 మందికి పైగా కార్మికులు అక్కడే ఉన్నారు. సైరంగ్ జీరో పాయింట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 196వ నెంబర్ రైల్వే బ్రిడ్జి కూలిపోయింది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!