Mizoram: మిజోరాంలో వంతెన కూలిపోయిన బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిజోరంలోని కురుంగ్ నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది చనిపోయారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ విషయాన్ని ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సబ్యసాచి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది అని సబ్యసాచి చెప్పారు.
Read Also: Student Suicide: కాలేజీలోని వాష్రూమ్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం తెలిపాడు. మృతుల బంధువులకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్తంగా మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్లో సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Baby: మూవీ లవర్స్ కి అలర్ట్.. బేబీ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది..
రాజధాని నగరం ఐజ్వాల్కు 21కి.మీ దూరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతోన్న సమయంలో ఈ వంతెన కూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో మొత్తం 28 మందికి పైగా కార్మికులు అక్కడే ఉన్నారు. సైరంగ్ జీరో పాయింట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 196వ నెంబర్ రైల్వే బ్రిడ్జి కూలిపోయింది.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!