Suryakumar Yadav: ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా.. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి!
- భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్
- ప్రెస్ కాన్ఫరెన్స్లో సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- సాంట్నర్ వ్యాఖ్యలపై స్పందించిన సూర్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Counter to Mitchell Santner Before T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు ముందు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మాటల యుద్ధం కూడా ఆసక్తికరంగా మారింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన వ్యాఖ్యలకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరదాగా స్పందించాడు. తాము మైదానంలో జనాలను నిశ్శబ్దం వహించేలా చేయాలనుకుంటున్నాం అని సాంట్నర్ అనగా.. ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా అంటూ సూరీడు కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం సూర్యకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ నేపథ్యంలో ఇరు ఇరు జట్ల కెప్టెన్స్ సూర్యకుమార్ యాదవ్, మిచెల్ సాంట్నర్ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సాంట్నర్ మాట్లాడుతూ… ‘మేం ఫేవరెట్స్ కాదని అందరూ అనుకున్నపుడు వెళ్లి ఆడడం సవాలే కానీ.. దాన్ని పట్టించుకోం. సొంతగడ్డ కాబట్టి టీమిండియాకు మద్దుతు ఉంటుంది. మేం నరేంద్ర మోడీ స్టేడియంలోని జనాలు నిశ్శబ్దం వహించేలా చేయాలనుకుంటున్నాం. ఈసారి ట్రోఫీ గెలవడానికి కొన్ని హృదయాలను బద్దలుగొట్టడానికైనా నేను సిద్ధమే’ అని వ్యాఖ్యానించాడు. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలనే తన జట్టు పట్టుదలను సాంట్నర్ ఈ వ్యాఖ్యల ద్వారా వెల్లడించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ముంగిట ఆసీస్ కెప్టెన్ కమిన్స్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
- Clicky Ponting: 'ఫేక్ ఎడ్జ్' చీటింగ్ చేసింది ఇతగాడే.. వివాదంలో కొత్త ట్విస్ట్.. భారతీయ స్పాన్సర్షిప్ గుడ్బై!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
మిచెల్ సాంట్నర్ వ్యాఖ్యలపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్… ‘భారత్కు వచ్చిన ప్రతి కెప్టెన్ అదే లైన్ను మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారు. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి’ అని నవ్వుతూ స్పందించాడు. సూర్య చెప్పిన ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్న జర్నలిస్టుల్లోనూ నవ్వులు పూయించాయి. ‘మా జట్టులో అందరూ చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారు. సంజు శాంసన్ తుది జట్టులోకి తీసుకు రావడం టోర్నీలో కీలక మలుపు. ఒక్కసారిగా అన్నీ మారిపోయాయి’ అని సూర్య చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ ముందు ఇలాంటి సరదా వ్యాఖ్యలు మ్యాచ్పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరిత పోరును అందించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Chennai Love Story :రివ్యూయర్స్ ను తిట్టకుండా.. మాట విన్నారు, హిట్టు కొట్టారు!
-
Lok Sabha: లోక్సభలో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు
-
CJP: మోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముడదాం.. రైతులతో కలిసి కాక్రోచ్ల ప్లాన్..
-
Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
-
Adarsha Kutumbam: గురూజీ మారిపోయాడా?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!