Suryakumar Yadav: ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా.. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి!
- భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్
- ప్రెస్ కాన్ఫరెన్స్లో సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- సాంట్నర్ వ్యాఖ్యలపై స్పందించిన సూర్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Counter to Mitchell Santner Before T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు ముందు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మాటల యుద్ధం కూడా ఆసక్తికరంగా మారింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన వ్యాఖ్యలకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరదాగా స్పందించాడు. తాము మైదానంలో జనాలను నిశ్శబ్దం వహించేలా చేయాలనుకుంటున్నాం అని సాంట్నర్ అనగా.. ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా అంటూ సూరీడు కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం సూర్యకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ నేపథ్యంలో ఇరు ఇరు జట్ల కెప్టెన్స్ సూర్యకుమార్ యాదవ్, మిచెల్ సాంట్నర్ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సాంట్నర్ మాట్లాడుతూ… ‘మేం ఫేవరెట్స్ కాదని అందరూ అనుకున్నపుడు వెళ్లి ఆడడం సవాలే కానీ.. దాన్ని పట్టించుకోం. సొంతగడ్డ కాబట్టి టీమిండియాకు మద్దుతు ఉంటుంది. మేం నరేంద్ర మోడీ స్టేడియంలోని జనాలు నిశ్శబ్దం వహించేలా చేయాలనుకుంటున్నాం. ఈసారి ట్రోఫీ గెలవడానికి కొన్ని హృదయాలను బద్దలుగొట్టడానికైనా నేను సిద్ధమే’ అని వ్యాఖ్యానించాడు. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలనే తన జట్టు పట్టుదలను సాంట్నర్ ఈ వ్యాఖ్యల ద్వారా వెల్లడించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ముంగిట ఆసీస్ కెప్టెన్ కమిన్స్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
- IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
- New Players: టీమిండియాలోకి ముగ్గురు కొత్త యువ ఆటగాళ్లు.. మొదటిసారి టీ20 జట్టులోకి..
- Sanju Samson: సంజూ.. సంజూ.. సంజూ.. భారీగా పెరుగుతున్న మద్దతు.. ‘మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా’..
మిచెల్ సాంట్నర్ వ్యాఖ్యలపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్… ‘భారత్కు వచ్చిన ప్రతి కెప్టెన్ అదే లైన్ను మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారు. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి’ అని నవ్వుతూ స్పందించాడు. సూర్య చెప్పిన ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్న జర్నలిస్టుల్లోనూ నవ్వులు పూయించాయి. ‘మా జట్టులో అందరూ చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారు. సంజు శాంసన్ తుది జట్టులోకి తీసుకు రావడం టోర్నీలో కీలక మలుపు. ఒక్కసారిగా అన్నీ మారిపోయాయి’ అని సూర్య చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ ముందు ఇలాంటి సరదా వ్యాఖ్యలు మ్యాచ్పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరిత పోరును అందించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!