తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారాలైన ‘గద్దర్ అవార్డులను’ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ వరించింది. ఈ వార్త తెలియగానే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ గౌరవంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Also Read :Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్ హర్’ అంటూ ముందడుగు..
‘అన్నయ్య చిరంజీవి గారికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన సాగించిన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’ అంటూ పవన్ కొనియాడారు. గద్దర్ అవార్డులకు ఎంపికైన మిగతా విజేతలకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అక్కినేని ఇంట్లో కూడా అవార్డుల సందడి నెలకొంది. ‘తండేల్’ (Thandel) సినిమాలో అద్భుతమైన నటన కనబరిచినందుకు గాను నాగచైతన్యకు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. దీనిపై కింగ్ నాగార్జున స్పందిస్తూ.. ‘చైతూ ఉత్తమ నటుడిగా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది. ‘తండేల్’ కోసం తను పెట్టిన కష్టం, చూపిన అంకితభావానికి ఈ అవార్డు సరైన గుర్తింపు’ అంటూ తన కుమారుడిని అభినందించారు.