Narendra Modi: గద్దర్ భార్యకు ప్రధాని మోడీ లేఖ.. మీ బాధను మాటల్లో చెప్పలేను అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: ప్రజాకవి గద్దర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కాగా గద్దర్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి తానెంతో బాధపడ్డానని ఆయన భార్య విమలకు మోడీ లేఖ రాశారు. తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్ కుటుంబానికి మోడీ సానుభూతిని తెలియజేశారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని మోడీ లేఖలో తెలిపారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ కొనియాడారు. గద్దరు కుటుంబ సభ్యుల దు:ఖాన్ని మాటల్లో చెప్పలేనని, ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు దీనిని తట్టుకునే శక్తిని ప్రసాదించమని కోరకుంటున్నానని మోదీ తెలిపారు. చివరిగా లేఖలో ఓంశాంతి అని పేర్కొన్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ అనారోగ్యంతో మృతి చెందారనే విషయాన్ని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి తాజాగా మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మోదీ గద్దర్ భార్య విమలకు లేఖ రాశారు. కాగా ప్రముఖ విప్లవకారుడు, ప్రజాకవి గద్దర్ ఆగస్టు 6 వ తేదీన అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. తన మాటనే పాటగా మలచి ఎంతో మందిలో స్ఫూర్తి నింపిన ప్రజా యుద్ద నౌక గద్దరు ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. మొదట ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిన వైద్యులు రెండు రోజుల్లో ఆయన మరణించాడని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా గద్దర్ కీలకపాత్ర పోషించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ప్రజా కవిగా, ప్రజా యుద్ద నౌకగా గద్దర్ కు పేరుంది. ఇక గద్దర్ మరణ వార్త రెండు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురిచేసింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సానుభూతిని తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోదీ కూడా ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ఆయన అంతిమ యాత్రను చూసేందుకు కూడా జనాలు భారీగా తరలివచ్చి గద్దర్ పై తమకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంతిమ సంస్కారాలు జరిగిన విషయం విదితమే.
Also Read
- VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
- India-Pakistan: "పాకిస్తాన్తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
తాజావార్తలు
-
Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!
-
VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!