Mamata Banerjee: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సస్పెన్షన్.. సిగ్గుపడాల్సిన విషయమన్న దీదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సకాలంలో ఎన్నికలు నిర్వహించనందుకు ప్రపంచ రెజ్లింగ్ అపెక్స్ బాడీ UWW రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)ని గురువారం సస్పెండ్ చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇది దేశానికి ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు. “యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) డబ్ల్యుఎఫ్ఐని సస్పెండ్ చేసిందని తెలిసి షాక్ అయ్యానని మమతా బెనర్జీ తెలిపారు. ఇది యావత్ దేశం సిగ్గుపడాల్సిన విషయం. మన కుస్తీ సోదరీమణుల దీనస్థితిపై కేంద్ర ప్రభుత్వం అవమానకరంగా అహంకారంతో వ్యవహరిస్తూ నిరాశపరిచిందని ఆమే పేర్కొన్నారు. అంతేకాకుండా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతదేశ సోదరీమణులను స్త్రీద్వేషం, పురుష దురహంకారంతో ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని.. ఇంకెంతో సమయం లేదని దీదీ దుయ్యబట్టారు.
Solar Energy: సోలార్ ఎనర్జీ ఉపయోగాలే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి మీకు తెలుసా?
Also Read
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
మరోవైపు UWW యొక్క నిర్ణయం కారణంగా.. రాబోయే ప్రపంచ ఛాంపియన్షిప్లలో భారతీయ రెజ్లర్లు భారత జెండా తరుపున ఆడలేరు. సెప్టెంబర్ 16న ప్రారంభమయ్యే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు తటస్థ ఆటగాళ్లుగా పాల్గొంటారు. భూపేంద్ర సింగ్ బజ్వా నేతృత్వంలోని తాత్కాలిక ప్యానెల్కు ఎన్నికల నిర్వహణకు 45 రోజుల గడువు ఇచ్చారు. రెజ్లింగ్ పనితీరును పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 27న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఈ ప్యానెల్ను నియమించింది.
TS High Court: గద్వాల ఎమ్మెల్యేకు షాక్.. తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు
డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు మే 7న జరగాల్సి ఉండగా.. అది చెల్లదని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. WFI ఎన్నికలను జూలై 11న నిర్వహించాలని ఎన్నికల అధికారి మళ్లీ నిర్ణయించారు. అయితే అస్సాం రెజ్లింగ్ అసోసియేషన్ గౌహతి హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత కోర్టు ఎన్నికలపై స్టే విధించింది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రా రెజ్లింగ్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. గౌహతి హైకోర్టు నిర్ణయాన్ని కోర్టు పక్కన పెట్టింది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు ఆగస్టు 12న జరుగుతాయని ఎన్నికల అధికారి తెలిపారు. అయితే పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్ పిటిషన్పై స్టే విధించింది.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!