Mamata Banerjee: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సస్పెన్షన్.. సిగ్గుపడాల్సిన విషయమన్న దీదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సకాలంలో ఎన్నికలు నిర్వహించనందుకు ప్రపంచ రెజ్లింగ్ అపెక్స్ బాడీ UWW రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)ని గురువారం సస్పెండ్ చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇది దేశానికి ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు. “యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) డబ్ల్యుఎఫ్ఐని సస్పెండ్ చేసిందని తెలిసి షాక్ అయ్యానని మమతా బెనర్జీ తెలిపారు. ఇది యావత్ దేశం సిగ్గుపడాల్సిన విషయం. మన కుస్తీ సోదరీమణుల దీనస్థితిపై కేంద్ర ప్రభుత్వం అవమానకరంగా అహంకారంతో వ్యవహరిస్తూ నిరాశపరిచిందని ఆమే పేర్కొన్నారు. అంతేకాకుండా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతదేశ సోదరీమణులను స్త్రీద్వేషం, పురుష దురహంకారంతో ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని.. ఇంకెంతో సమయం లేదని దీదీ దుయ్యబట్టారు.
Solar Energy: సోలార్ ఎనర్జీ ఉపయోగాలే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి మీకు తెలుసా?
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
మరోవైపు UWW యొక్క నిర్ణయం కారణంగా.. రాబోయే ప్రపంచ ఛాంపియన్షిప్లలో భారతీయ రెజ్లర్లు భారత జెండా తరుపున ఆడలేరు. సెప్టెంబర్ 16న ప్రారంభమయ్యే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు తటస్థ ఆటగాళ్లుగా పాల్గొంటారు. భూపేంద్ర సింగ్ బజ్వా నేతృత్వంలోని తాత్కాలిక ప్యానెల్కు ఎన్నికల నిర్వహణకు 45 రోజుల గడువు ఇచ్చారు. రెజ్లింగ్ పనితీరును పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 27న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఈ ప్యానెల్ను నియమించింది.
TS High Court: గద్వాల ఎమ్మెల్యేకు షాక్.. తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు
డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు మే 7న జరగాల్సి ఉండగా.. అది చెల్లదని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. WFI ఎన్నికలను జూలై 11న నిర్వహించాలని ఎన్నికల అధికారి మళ్లీ నిర్ణయించారు. అయితే అస్సాం రెజ్లింగ్ అసోసియేషన్ గౌహతి హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత కోర్టు ఎన్నికలపై స్టే విధించింది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రా రెజ్లింగ్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. గౌహతి హైకోర్టు నిర్ణయాన్ని కోర్టు పక్కన పెట్టింది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు ఆగస్టు 12న జరుగుతాయని ఎన్నికల అధికారి తెలిపారు. అయితే పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్ పిటిషన్పై స్టే విధించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!