Nuh Voilence: నుహ్లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. 144 సెక్షన్ విధింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత జూలైలో నుహ్లో జరిగిన హింసాకాండ.. ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసిందే. అయితే మరోసారి అలాంటి హింసలకు పాల్పడకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కారణమేంటంటే.. ఆగస్టు 28న బ్రిజ్ మండల్ ఆధ్వర్యంలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ ‘శోభా యాత్ర’ చేపట్టనున్నారు. దీంతో మతపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నుహ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ మరియు బల్క్ SMS సేవలను ఆగస్టు 28 వరకు నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం శనివారం ఆదేశించింది.
Viral Video: దాహం వేసి నీటి కోసం కష్టపడుతున్న కుక్క.. ఓ మహిళ ఏం చేసిందంటే
Also Read
- Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేస్.. కోహ్లీకి ఛాన్స్ లేనట్లే.. ముందంజలో కాటేరమ్మ పెద్ద కొడుకు..
- Supreme Court: VVPAT స్లిప్పులపై ‘టైమ్ స్టాంప్’.. సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. ఏమన్నారంటే..
- Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..
- Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ ఆల్టైమ్ ఐపీఎల్ రికార్డుకు ఎసరు.. గురి తప్పదంటున్న వైభవ్ సూర్యవంశీ..
సోమవారం నిర్వహించే ఈ ర్యాలీ సమయంలో సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్) టీవీఎస్ఎన్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాన్ని నిషేధిస్తూ 144 సెక్షన్ కూడా విధించారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 26-28 వరకు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.
Veena Srivani: వేణుస్వామి భార్య ట్యాలెంట్ ను చూశారా.. మతిపోవాల్సిందంతే
అంతేకాకుండా.. లైసెన్స్ పొందిన తుపాకులు, లాఠీలు, గొడ్డళ్లు ఇతర ఆయుధాలను ఎవరూ తీసుకెళ్లడానికి లేదని పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా మత ఘర్షణలు చెలరేగడంతో నుహ్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జులై 31న నుహ్లో చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతగురువు సహా ఆరుగురు మరణించారు.
Rashmi Gautam: బాత్ టబ్లో రష్మీ గౌతమ్ టీజింగ్.. ఆ ఒక్కటి చూపించమంటున్న నెటిజన్లు
మరోవైపు నుహ్ లో శోభా యాత్ర నేపథ్యంలో నూహ్ డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత ప్రసాద్కు లేఖ రాశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సామాజిక వ్యతిరేక శక్తులు సోషల్ మీడియా/బల్క్ మెసేజ్లను దుర్వినియోగం చేస్తున్నారనే భయం ఉందని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని అడిషనల్ చీఫ్ సెక్రటరీని కోరారు.
తాజావార్తలు
-
Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేస్.. కోహ్లీకి ఛాన్స్ లేనట్లే.. ముందంజలో కాటేరమ్మ పెద్ద కొడుకు..
-
ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ‘Cockroach Janata Party’.. ఈసీకి అప్లికేషన్! అప్లై చేసింది ఎవరో తెలుసా?
-
Ebola: ఆఫ్రికాను దాటేసిన ఎబోలా..? భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Karnataka CM: ఢిల్లీ వేదికగా సిద్ధరామయ్య ఔట్.. కర్ణాటక సీఎం పగ్గాలు డీకే హస్తగతం!
ట్రెండింగ్
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!