Nuh Voilence: నుహ్లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. 144 సెక్షన్ విధింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత జూలైలో నుహ్లో జరిగిన హింసాకాండ.. ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసిందే. అయితే మరోసారి అలాంటి హింసలకు పాల్పడకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కారణమేంటంటే.. ఆగస్టు 28న బ్రిజ్ మండల్ ఆధ్వర్యంలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ ‘శోభా యాత్ర’ చేపట్టనున్నారు. దీంతో మతపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నుహ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ మరియు బల్క్ SMS సేవలను ఆగస్టు 28 వరకు నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం శనివారం ఆదేశించింది.
Viral Video: దాహం వేసి నీటి కోసం కష్టపడుతున్న కుక్క.. ఓ మహిళ ఏం చేసిందంటే
Also Read
- Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
- Newton's Third Law: ‘న్యూటన్స్ థర్డ్ లా’ మూవీ రివ్యూ..
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
- TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
సోమవారం నిర్వహించే ఈ ర్యాలీ సమయంలో సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్) టీవీఎస్ఎన్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాన్ని నిషేధిస్తూ 144 సెక్షన్ కూడా విధించారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 26-28 వరకు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.
Veena Srivani: వేణుస్వామి భార్య ట్యాలెంట్ ను చూశారా.. మతిపోవాల్సిందంతే
అంతేకాకుండా.. లైసెన్స్ పొందిన తుపాకులు, లాఠీలు, గొడ్డళ్లు ఇతర ఆయుధాలను ఎవరూ తీసుకెళ్లడానికి లేదని పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా మత ఘర్షణలు చెలరేగడంతో నుహ్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జులై 31న నుహ్లో చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతగురువు సహా ఆరుగురు మరణించారు.
Rashmi Gautam: బాత్ టబ్లో రష్మీ గౌతమ్ టీజింగ్.. ఆ ఒక్కటి చూపించమంటున్న నెటిజన్లు
మరోవైపు నుహ్ లో శోభా యాత్ర నేపథ్యంలో నూహ్ డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత ప్రసాద్కు లేఖ రాశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సామాజిక వ్యతిరేక శక్తులు సోషల్ మీడియా/బల్క్ మెసేజ్లను దుర్వినియోగం చేస్తున్నారనే భయం ఉందని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని అడిషనల్ చీఫ్ సెక్రటరీని కోరారు.
తాజావార్తలు
-
PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
-
Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
-
TVS Raider Doctor Doom Edition: మార్వెల్ డాక్టర్ డూమ్ స్ఫూర్తితో టీవీఎస్ కొత్త బైక్.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే!
-
Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!