ఒక సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ అందరికీ సౌరశక్తిని అందించడానికి వీలు కల్పిస్తుందని భారత ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం గ్లాస్గోలో జరుగుతున్న COP26 వాతావరణ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్’ (IRIS)ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ వాతావరణ మార్పుల ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరని గత కొన్ని దశాబ్దాలు రుజువు చేశాయన్నారు. అనంతరం స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, నేపాల్, మలావి,…
ప్రధాని విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 29 నుంచి నవంబరు 2 వరకు ఇటలీ, బ్రిటన్లలో పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు.. ఇటలీలోని రోమ్లో అక్టోబరు 30-31 తేదీల్లో జరగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జీ-20 సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇటలీ పర్యటన తర్వాత మోడీ.. గ్లాస్గౌలో జరిగే కాప్-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్కు వెళ్లనున్నారు.…
ఒకటి కాదు రెండు కాదు.. వంద కోట్ల టీకాలు భారతజాతి ప్రపంచానికి చాటిన ఐక్యతా అంశం. ‘మన్ కీ బాత్’ 82 వ రేడియో ఎడిషన్లో ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్లు ఇవ్వడం భారతదేశ శక్తిని అందరికీ చూపించిందన్నారు మోడీ. కరోనాపై పోరులో ఇదో మైలురాయి అని ప్రధాని మోడీ అన్నారు. వ్యాక్సిన్లు అందరికీ అందిస్తామన్నారు. అసాధ్యం అని భావించిన ఈ విజయం తర్వాత…
కరోనా మహమ్మరి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసింది. కరోనా బారినపడి ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. కరోనాతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్దాయి. కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం కొవిడ్ టీకాలను తీసుకువచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీకా ఉత్సవ్ విజయవంతమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా తరువాత 100 కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ మైలురాయి దాటిన రెండవ దేశంగా భారతదేశం చరిత్ర లిఖించింది. అంతేకాకుండా కొవిడ్ టీకాలపై అపోహలు పక్కన పెట్టి…
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఆ రెండు విషయాల గురించి నోరుమెదపడం లేదని, దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, లడఖ్ లోని భారత భూభాగాన్ని చైనా అక్రమించిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదంటూ నిప్పులు చెరిగారు. కశ్మీర్ లో మన భారత సైనికులు ఉగ్రవాదుల చేతిలో చనిపోతుంటే.. పాకిస్థాన్ తో ఈ నెల 24న టీ20 క్రికెట్…
ప్రధాని నరేంద్ర మోడీ-కేంద్ర హోంశాఖ అమిత్షా ద్వయానికి గుజరాత్ రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వంలోనూ ప్రత్యేక స్థానం ఉంది.. ఆ ఇద్దరు కలిసి ఎన్నో విజయాలను అందుకున్నారు.. మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కలిపి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ టీవీ చానెల్తో ప్రత్యేంగా మాట్లాడిన అమిత్ షా.. ప్రధాని మోడీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను బటయపెట్టారు.. మోడీ నియంత కాదని, తనకు తెలిసిన అత్యంత ప్రజాస్వామిక నేతల్లో ఒకరని పేర్కొన్న ఆయన.. మోడీ…
మోదీ సర్కారుకు ప్రజా వ్యతిరేకత తెలిసి వస్తోందా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తోంది. తాజాగా బీజేపీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలే ఇందుకు నిదర్శంగా కన్పిస్తున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లోని సీఎంలను సైతం బీజేపీ హఠాత్తుగా మార్చేస్తుండటంతో ఆపార్టీకి సెగ భారీగానే తాకుతోందని అర్థమవుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మోదీ-షాలు వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలోనే సీఎం మార్పు చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు బీజేపీ ఆయా రాష్ట్రాల్లో వరుసబెట్టి నాయకత్వాన్ని మార్చివేస్తుందని రాజకీయ విశ్లేషకులు…
టోక్యో ఒలింపిక్స్ 2021లో హైదరాబాద్కు చెందిన భారతీయ షట్లర్ పివి సింధు కాంస్య పతకం సాధించింది. ఆమె చైనాకు చెందిన హి బింగ్జియావోను 2 వరుస సెట్లలో ఓడించింది. సింధు ఇప్పుడు వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన రెండవ భారతీయ అథ్లెట్. ఈ మ్యాచ్లో విజయంతో ఆమె అరుదైన ఘనతను సాధించింది. కాంస్య మ్యాచ్లో సింధు చారిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. “సింధు అద్భుతమైన విజయంతో మేమంతా ఉల్లాసంగా ఉన్నాము. టోక్యో 2020లో…
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. నేడు పార్లమెంట్ భవనంలో మూడు సమావేశాలు జరగనుండగా.. పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో నేడు 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. సమావేశానికి ఉభయ సభలకు చెందిన అన్ని పక్షాల నాయకులు హాజరు కానున్నారు. వర్షాకాల…
కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది.. రేపు సాయంత్రం 5.30 – 6 గంటల మధ్య కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది.. కనీసం ఆరుగురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.. మొత్తంగా 20 మందికి పైగా కొత్తవారికి బెర్త్లు దక్కే అవకాశం ఉందని సమాచారం.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు.. పెద్ద రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కొచ్చని చెబుతున్నారు.. కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో పాటు.. పాత మంత్రులకు షాక్…