PM Modi: 2 దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి జరిగింది.. ఇది దేశానికే గర్వకారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 2 నెలల్లోనే నాలుగు సార్లు గుజరాత్లో పర్యటించిన మోదీ.. తాజాగా శుక్రవారం దాదాపు రూ. 3,050 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నవ్సారిలో జరిగిన ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
రాష్ట్రంలో అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని.. గుజరాత్ ప్రజలతోనే తనకు దేశానికి సేవ చేసే భాగ్యం కలిగిందని మోడీ పేర్కొన్నారు. ఇన్నేళ్ల కాలంలో గిరిజన ప్రాంతంలో ఇలాంటి పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరగలేదంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. అదివాసీ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టినట్లు మోడీ వివరించారు. గుజరాత్లో గత రెండు దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి జరిగిందని.. ఇది దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందరి అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని తెలిపారు. రూ. 3,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే అవకాశం లభించడం గర్వకారణమని మోదీ పేర్కొన్నారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Karnataka: నా కారునే ఆపుతావా?.. రోడ్డుపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే కూతురు
ఈ ప్రాజెక్టులన్నీ సూరత్, తాపి, నవ్సారి, వల్సాద్తో సహా దక్షిణ గుజరాత్లోని కోట్లాది మంది ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, నీరు, రోడ్లు, వైద్యం, విద్య ఇలా అన్ని రకాల సంక్షేమ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని పేర్కొన్నారు. బీజేపీ సర్కార్ 8ఏళ్ల పాలనను ప్రస్తావిస్తూ.. సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదంతో తమ ప్రభుత్వం పేదల సంక్షేమం, కనీస సౌకర్యాలు కల్పించడంపై అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధిపై ఎవరూ దృష్టిసారించలేదంటూ ప్రధాని విమర్శలు గుప్పించారు. విమర్శించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..