Sandra Venkata Veeraiah: మోదీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి వరాల జల్లు కురిపిస్తానని ప్రకటన చేసిన మోదీ.. ఇక్కడికొచ్చిన తర్వాత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వీరయ్య విమర్శించారు. చిల్లర రాజకీయాలకు బేగంపేట విమానాశ్రయాన్ని వేదికగా చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం, టిఆర్ఎస్ పార్టీ మీదున్న అక్కసును వెళ్ళగక్కడానికే హైదరాబాద్ పర్యటనని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలు, మేధావులు, పెద్దలు రాష్ట్రం కోసం ఏం చేశారని ప్రశ్నలు సంధిస్తే.. అందుకు సమాధానం ఇచ్చే స్థితిలో మోదీ లేరని వీరయ్య అన్నారు. విభజన చట్టంలో హామీలు అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదా గానీ, ప్యాకేజ్ కానీ, ప్రాజెక్టులకు గానీ, తెలంగాణ ఇవ్వాల్సిన రైల్వే కొచ్ ప్యాక్టరీ గానీ ఇవ్వకుండా.. వాటిని మంగళం పాడిన ఘనత మోదీదేనని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి పన్నులు కట్టించే డబ్బుల్లో వాటా వస్తుందో లేదో లెక్కలతో సహా చెప్పినప్పటికీ.. వాటిని సమాధానం చెప్పకుండా టీఆర్ఎస్ ఓ కుటుంబ పార్టీ అని విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని.. ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారే తప్ప నామినేటెడ్ పదవులతో రాలేదన్నారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
తెలంగాణ పథకాలు యావత్తు భారతదేశం చూసి నేర్చుకునే విధంగా తెలంగాణ రాష్టాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వీరయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాల్లో.. గతంలో మీరు పరిపాలించిన గుజరాత్లో చేశారా? పోనీ తెలంగాణలో ఉన్న పథకాలకి కేంద్రం నుంచి నయా పైగా ఇచ్చారా? అంటూ నిలదీశారు. పొత్తులు పెట్టుకున్న ఘనత బీజేపీదేనని చెప్పిన సండ్ర వెంకట వీరయ్య.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కాదు కదా, డిపాజిట్లు కూడా రావని వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!