Errabelli Dayakar Rao: మోదీని గద్దె దింపడమే కేసీఆర్ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి కౌంటర్లిచ్చారు. అవగాహన లేకుండా, చరిత్ర తెలియకుండా, మోదీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన పదవికి తగ్గట్టుగా లేవన్నారు. మోదీకి కుటుంబం లేదని, అందువల్లే ఆయనకు సెంటిమెంట్లు తెలియవని అన్నారు. సీఎం కేసిఆర్ది కుటుంబ పాలన కాదని చెప్పిన ఎర్రబెల్లి.. తెలంగాణ కోసం ఆయన కుటుంబం ఉద్యమించి, జైళ్ళకు పోయి, త్యాగాలు చేసిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని అవమానించడమంటే.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని ఎర్రబెల్లి చెప్పారు.
తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో కించపరిచిన మోదీ.. తెలంగాణ ప్రజల్ని నూకలు తినమని అవమాన పరిచారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. తెలంగాణకు నయా పైసా ఇవ్వకుండా వివక్ష చూపిస్తూనే ఉన్నారని.. ఇప్పుడు వచ్చి తెలంగాణపై కపట ప్రేమ చూపిస్తే ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. తెలంగాణ పై వివక్ష చూపడం, విషం చిమ్మడం, విద్వేషంతో మాట్లాడటమే మీ పనా? అయితే మతం లేకపోతే ప్రాంతాల పేరుతో ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో మీరు గెలిస్తే.. తెలంగాణ అభివృద్ధి చేసి మళ్ళీ కేసీఆర్ ఎన్నికల్లో గెలిచారన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టనవి కూడా అమలు చేశామని చెప్పారు. వడ్లు కొనుగోలు ఆలస్యం కావడానికి బీజేపీనే ప్రధాన కారణమన్నారు.
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Viral Divorce: పెళ్లి కోసం వయసు తగ్గించి చెప్పిన భర్త.. కోర్టుకు వెళ్లి విడాకులు తెచ్చుకున్న భార్య..
- Ration Card: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటికి రేషన్ కార్డు జారీ.. MRO ఏమన్నారంటే..
- Narahari Rao : బ్యాంక్ లాకర్ తెరిస్తే షాక్.. నరహరి దాచిన నోట్ల కట్టలు, కిలోల బంగారం.!
ఒక్క మెడికల్ కాలేజి తెలంగాణకి ఇచ్చారా? బ్యాంక్లను ముంచినోళ్ళని పట్టకువచ్చారా? అని నిలదీసిన ఎర్రబెల్లి.. దేవుని మీద గౌరవం ఉంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీనే పాలిత రాష్ట్రాల్లో కుటుంబ పాలన కొనసాగిస్తోందని.. అంబానీ, అదానిల కోసమే ఆ పార్టీ పని చేస్తోందని ఆరోపించారు. మోదీని గద్దె దింపడానికి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని.. మోదీని గద్దె దింపడమే ఆయన ఏకైక లక్ష్యమని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
-
Meloni-Trump: ముందు మీ ప్రజాదరణ చూసుకోండి.. ట్రంప్పై మరోసారి మెలోని తీవ్ర ఆగ్రహం
-
Fathers Day: వెన్నుతట్టి నడిపించే ధైర్యం ‘నాన్న’.. ఫాదర్స్ డే (జూన్ 21) సందర్భంగా బెస్ట్ కొటేషన్స్ మీ కోసం..
-
IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్స్వీప్ చేసిన టీమిండియా..
-
Iran vs US: హర్మూజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!