Errabelli Dayakar Rao: మోదీని గద్దె దింపడమే కేసీఆర్ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి కౌంటర్లిచ్చారు. అవగాహన లేకుండా, చరిత్ర తెలియకుండా, మోదీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన పదవికి తగ్గట్టుగా లేవన్నారు. మోదీకి కుటుంబం లేదని, అందువల్లే ఆయనకు సెంటిమెంట్లు తెలియవని అన్నారు. సీఎం కేసిఆర్ది కుటుంబ పాలన కాదని చెప్పిన ఎర్రబెల్లి.. తెలంగాణ కోసం ఆయన కుటుంబం ఉద్యమించి, జైళ్ళకు పోయి, త్యాగాలు చేసిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని అవమానించడమంటే.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని ఎర్రబెల్లి చెప్పారు.
తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో కించపరిచిన మోదీ.. తెలంగాణ ప్రజల్ని నూకలు తినమని అవమాన పరిచారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. తెలంగాణకు నయా పైసా ఇవ్వకుండా వివక్ష చూపిస్తూనే ఉన్నారని.. ఇప్పుడు వచ్చి తెలంగాణపై కపట ప్రేమ చూపిస్తే ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. తెలంగాణ పై వివక్ష చూపడం, విషం చిమ్మడం, విద్వేషంతో మాట్లాడటమే మీ పనా? అయితే మతం లేకపోతే ప్రాంతాల పేరుతో ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో మీరు గెలిస్తే.. తెలంగాణ అభివృద్ధి చేసి మళ్ళీ కేసీఆర్ ఎన్నికల్లో గెలిచారన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టనవి కూడా అమలు చేశామని చెప్పారు. వడ్లు కొనుగోలు ఆలస్యం కావడానికి బీజేపీనే ప్రధాన కారణమన్నారు.
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
ఒక్క మెడికల్ కాలేజి తెలంగాణకి ఇచ్చారా? బ్యాంక్లను ముంచినోళ్ళని పట్టకువచ్చారా? అని నిలదీసిన ఎర్రబెల్లి.. దేవుని మీద గౌరవం ఉంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీనే పాలిత రాష్ట్రాల్లో కుటుంబ పాలన కొనసాగిస్తోందని.. అంబానీ, అదానిల కోసమే ఆ పార్టీ పని చేస్తోందని ఆరోపించారు. మోదీని గద్దె దింపడానికి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని.. మోదీని గద్దె దింపడమే ఆయన ఏకైక లక్ష్యమని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Gyanesh Kumar: ప్రపంచంలోనే భారత్లో విశ్వసనీయమైన ‘సర్’ నిర్వహిస్తున్నాం
-
Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
-
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
-
Vivo Over Ear Headphones: వివో తొలి వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్ఫోన్స్ విడుదల.. 75 గంటల బ్యాటరీ, 58dB ANC ఫీచర్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..