ఉత్తమ్ కుమార్రెడ్డి. ప్రస్తుతం నల్లగొండ ఎంపీ. గతంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే. పీసీసీ మాజీ చీఫ్. ఎంపీగా కిక్కు ఇవ్వలేదో.. అసెంబ్లీనే ముద్దు అనుకుంటున్నారో కానీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు. హుజూర్నగర్ను విడిచిపెట్టేది లేదని.. ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ఇటీవలే ఓపెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఉత్తమ్. నల్లగొండ ఎంపీగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ ఏం చేస్తారు అనేదానిపై పార్టీ కేడర్లో ఇన్నాళ్లూ కొంత సస్పెన్స్ ఉండేది. ఆ ఉత్కంఠకు ఆయన తెరదించేశారు.…
కోటి ఆశలతో విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్ధులు ప్రమాదాలకు గురై తిరిగిరాని లోకాలకు చేరారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ నెల 7న యూఎస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్ రెడ్డి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో అఖిల్ గల్లంతయ్యాడు. ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్ళారు. అఖిల్ ఆచూకీ కోసం జర్మన్ రాయబార కార్యాలయానికి కేంద్రం లేఖ రాసింది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…
మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ . నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తరణలో పోతున్న యాభై ఏళ్ళకు పైబడ్డ వృక్షాలకు తిరిగి పునరుజ్జీవం పోస్తున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు. నల్లగొండ మున్సిపల్ కమీషనర్ రమణాచారి విజ్ఠప్తిని మన్నించి రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ కార్యక్రమానికి పూనుకున్నారు. మంగళవారం ఉదయం నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్…
నల్గొండ జిల్లా… తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయం పీక్ స్టేజ్ కి చేరింది.ఫిర్యాదుల పర్వంతో నియోజకవర్గ రాజకీయాలు హీటెక్కాయి.కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, దామోదర రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి గత ఎన్నికల్లో తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కి వ్యతిరేకంగా పని చేసిన డాక్టర్ రవి ని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే అద్దంకి… 2018 ఎన్నికల్లో టియ్యారెస్ కు అనుకూలంగా పని చేసిన రవి ని ఎలా తీసుకు వస్తారనీ.. రాహుల్ గాంధీకి..సోనియా గాంధీకి ఫిర్యాదు…
అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది తెలంగాణలో రేషన్ కార్డుల వ్యవహారం. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ళు గడుస్తున్నా రేషన్ కార్డుల్లో చనిపోయిన వారి పేర్లని తొలగించడం లేదు. దింతో చనిపోయిన వారికి రేషన్ బియ్యం సరఫరా అవుతుండగా.. బతికి ఉన్న వారి పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చక పోవడం తో రేషన్ బియ్యం ఇవ్వడం…
తేల్చుకుందాం.. రా! ఆ నియోజకవర్గంలో నాయకుల మాటల తూటాలు ఈ రేంజ్లోనే పేలుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీలోకి దిగాలని ఒకరు.. ఎలా వస్తారో చూస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే పొలిటికల్ టెంపరేచర్ను పెంచేస్తున్నారు. ఆ రాజకీయ వేడి సెగలను ఈ స్టోరీలో చూద్దాం. హుజూర్నగర్పై మళ్లీ కన్నేసిన ఉత్తమ్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మరో ఏడాదిలోనే ఎన్నికలు రానున్నాయని జోస్యం…
ప్రజల బాధలను తీర్చడానికే పోలీస్ వ్యవస్థ ఉన్నది.. అయితే ఆ వ్యవస్థను చిన్న చిన్న కారణాలకు కొంతమంది వ్యక్తులు పోలీసులను ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా ఒక వ్యక్తి పోలీసులను ఇలాగే ఇబ్బందిపెట్టి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి హోలీ రోజున ఫుల్ గస మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను మటన్ వండమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించిందంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే…
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బకాయి సొమ్ములు అందక ధాన్యం రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పినా.. నెలలు గడుస్తున్నాయి. తమ డబ్బులెప్పుడు వస్తాయోనని ధాన్యం అమ్మిన రైతులు ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ధాన్యం రైతులు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 461 మంది రైతులకు సుమారు కోటి 25 లక్షలు చెల్లించాల్సి ఉంది కొనుగోలు కేంద్రాలు. డిసెంబర్ 25 నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి…
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కష్టాలు పేదలను సతాయిస్తున్నాయి. రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తుండటంతో రేషన్ బియ్యం రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్వర్ డౌన్ సమస్యలతో ఇప్పటి వరకు 40 శాతం మందికి కూడా పంపిణీ జరగలేదు. మరోవైపు రేషన్ బియ్యం ఇచ్చే గడువు 15తో ముగియడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. తమకు రేషన్ బియ్యం అందుతాయా లేదా అని వారు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తరచూ సర్వర్…
ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చింది. ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దుచేసుకున్న వారికి ఏడాది గడిచినా ఇంకా డబ్బులు అందలేదు. ఇలా దాదాపు 2 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉండడంతో ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూపులు తప్పడం లేదు. గత ఏడాది అక్టోబర్లో ధరణి సేవలు తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అదే నెల 28 నుంచి తహశీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం మొదట స్లాట్…