Nalgonda:దారుణం.. భార్యను చున్నీతో కడతేర్చిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుమానం పెనుభూతం అయింది.. కడదాకా కలిసి ఉంటానని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఆమె పాలిట మృత్యువుఅయ్యాడు. భార్యపై అనుమానంతో చున్నీతో మెడ బిగించి భార్యను దారుణంగా హత్య చేశాడు. సఖ్యతగా ఉంటారని అనుకుంటే.. తన కూతురును నమ్మించి హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
తల్లిదండ్రుల వివరణః
Also Read
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
పెళ్లయిన కొద్ది రోజులకే కాపురంలో కలతలు వచ్చాయి.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా పెరిగాయి… భర్త వేధింపులు భరించలేక ఆ నవ వధువు మెట్టినింటి గడప దాటింది. పుట్టింటికి చేరుకుంది. భర్త వేధింపుల విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అల్లుడి వేధింపులను గమనించిన అత్త మామ అల్లుడు కుటుంబ సభ్యులు ఒకసారి పిలిచి సఖ్యత గా ఉండాలని సూచించారు. మంచి చూసుకొవాలని వేడుకున్నారు.
మరోసారి కూతుర్ని అల్లుడు చేతిలో పెట్టి పంపించారు. కొన్నాళ్లు సాఫీగానే సంసారం సాగింది. హైదరాబాద్ కు ఉపాధి కోసం వెళ్తున్నానని చెప్పారు. కానీ ఎక్కడ ఉంటున్న విషయం అత్తమామలకు అల్లుడు శంకర్ చెప్పలేదు. దీంతో అల్లుడిపై అత్తామామలకు అనుమానం వచ్చింది.
కానీ నిన్న మధ్యాహ్నం కూతురు అల్లుడు ఫోన్ చేసారు భాగానే ఉన్నామని చెప్పారు. త్వరలోనే తిరిగి ఇంటి వస్తామని చెప్పారు… సంసారం సాఫీగా సాగుతుందని సంతోషంగా ఉన్నామని చెప్పడంతో సంబరపడ్డారు. కానీ మరోసారి మాట్లాడే ప్రయత్నం చేయడంతో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. కొద్ది సేపటికే స్థానిక శంకరంపేట పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు మృతురాలి బంధువులు.
అనుమానంః
భార్య సఖ్యతగా ఉండకపోవడంతో అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని పున్నమి లాడ్జిలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ముదావత్ శంకర్… అదే జిల్లా శంకర్ పల్లి కి చెందిన శిరీష తో ఫిబ్రవరి లో వివాహం జరిగింది. కొద్దిరోజులుగా వారిద్దరూ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ లో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులకు కూలీలుగా వచ్చారు. వివాహం అయినప్పటి నుండి శిరీష తన భర్తతో సఖ్యతగా ఉండకపోవడంతో అనుమానం పెంచుకున్న ఆమె భర్త శంకర్ ఆమెను నల్లగొండకు తీసుకువచ్చి లాడ్జిలో గదిఅద్దెకు తీసుకుని ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ శుక్రవారం సాయంత్రం వరకు గొడవపడినట్లు తెలుస్తోంది. గొడవ నేపథ్యంలోనే ఆమెను మెడను చున్నీతో బిగించి శంకర్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన అనంతరం భర్త పోలీసులకు లొంగి పోయినట్లు తెలుస్తోంది. ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించగా మృతదేహాన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్చరీకి తరలించారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!