Nalgonda:దారుణం.. భార్యను చున్నీతో కడతేర్చిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుమానం పెనుభూతం అయింది.. కడదాకా కలిసి ఉంటానని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఆమె పాలిట మృత్యువుఅయ్యాడు. భార్యపై అనుమానంతో చున్నీతో మెడ బిగించి భార్యను దారుణంగా హత్య చేశాడు. సఖ్యతగా ఉంటారని అనుకుంటే.. తన కూతురును నమ్మించి హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
తల్లిదండ్రుల వివరణః
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
పెళ్లయిన కొద్ది రోజులకే కాపురంలో కలతలు వచ్చాయి.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా పెరిగాయి… భర్త వేధింపులు భరించలేక ఆ నవ వధువు మెట్టినింటి గడప దాటింది. పుట్టింటికి చేరుకుంది. భర్త వేధింపుల విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అల్లుడి వేధింపులను గమనించిన అత్త మామ అల్లుడు కుటుంబ సభ్యులు ఒకసారి పిలిచి సఖ్యత గా ఉండాలని సూచించారు. మంచి చూసుకొవాలని వేడుకున్నారు.
మరోసారి కూతుర్ని అల్లుడు చేతిలో పెట్టి పంపించారు. కొన్నాళ్లు సాఫీగానే సంసారం సాగింది. హైదరాబాద్ కు ఉపాధి కోసం వెళ్తున్నానని చెప్పారు. కానీ ఎక్కడ ఉంటున్న విషయం అత్తమామలకు అల్లుడు శంకర్ చెప్పలేదు. దీంతో అల్లుడిపై అత్తామామలకు అనుమానం వచ్చింది.
కానీ నిన్న మధ్యాహ్నం కూతురు అల్లుడు ఫోన్ చేసారు భాగానే ఉన్నామని చెప్పారు. త్వరలోనే తిరిగి ఇంటి వస్తామని చెప్పారు… సంసారం సాఫీగా సాగుతుందని సంతోషంగా ఉన్నామని చెప్పడంతో సంబరపడ్డారు. కానీ మరోసారి మాట్లాడే ప్రయత్నం చేయడంతో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. కొద్ది సేపటికే స్థానిక శంకరంపేట పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు మృతురాలి బంధువులు.
అనుమానంః
భార్య సఖ్యతగా ఉండకపోవడంతో అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని పున్నమి లాడ్జిలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ముదావత్ శంకర్… అదే జిల్లా శంకర్ పల్లి కి చెందిన శిరీష తో ఫిబ్రవరి లో వివాహం జరిగింది. కొద్దిరోజులుగా వారిద్దరూ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ లో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులకు కూలీలుగా వచ్చారు. వివాహం అయినప్పటి నుండి శిరీష తన భర్తతో సఖ్యతగా ఉండకపోవడంతో అనుమానం పెంచుకున్న ఆమె భర్త శంకర్ ఆమెను నల్లగొండకు తీసుకువచ్చి లాడ్జిలో గదిఅద్దెకు తీసుకుని ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ శుక్రవారం సాయంత్రం వరకు గొడవపడినట్లు తెలుస్తోంది. గొడవ నేపథ్యంలోనే ఆమెను మెడను చున్నీతో బిగించి శంకర్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన అనంతరం భర్త పోలీసులకు లొంగి పోయినట్లు తెలుస్తోంది. ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించగా మృతదేహాన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్చరీకి తరలించారు.
తాజావార్తలు
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!