Nalgonda:దారుణం.. భార్యను చున్నీతో కడతేర్చిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుమానం పెనుభూతం అయింది.. కడదాకా కలిసి ఉంటానని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఆమె పాలిట మృత్యువుఅయ్యాడు. భార్యపై అనుమానంతో చున్నీతో మెడ బిగించి భార్యను దారుణంగా హత్య చేశాడు. సఖ్యతగా ఉంటారని అనుకుంటే.. తన కూతురును నమ్మించి హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
తల్లిదండ్రుల వివరణః
Also Read
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
పెళ్లయిన కొద్ది రోజులకే కాపురంలో కలతలు వచ్చాయి.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా పెరిగాయి… భర్త వేధింపులు భరించలేక ఆ నవ వధువు మెట్టినింటి గడప దాటింది. పుట్టింటికి చేరుకుంది. భర్త వేధింపుల విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అల్లుడి వేధింపులను గమనించిన అత్త మామ అల్లుడు కుటుంబ సభ్యులు ఒకసారి పిలిచి సఖ్యత గా ఉండాలని సూచించారు. మంచి చూసుకొవాలని వేడుకున్నారు.
మరోసారి కూతుర్ని అల్లుడు చేతిలో పెట్టి పంపించారు. కొన్నాళ్లు సాఫీగానే సంసారం సాగింది. హైదరాబాద్ కు ఉపాధి కోసం వెళ్తున్నానని చెప్పారు. కానీ ఎక్కడ ఉంటున్న విషయం అత్తమామలకు అల్లుడు శంకర్ చెప్పలేదు. దీంతో అల్లుడిపై అత్తామామలకు అనుమానం వచ్చింది.
కానీ నిన్న మధ్యాహ్నం కూతురు అల్లుడు ఫోన్ చేసారు భాగానే ఉన్నామని చెప్పారు. త్వరలోనే తిరిగి ఇంటి వస్తామని చెప్పారు… సంసారం సాఫీగా సాగుతుందని సంతోషంగా ఉన్నామని చెప్పడంతో సంబరపడ్డారు. కానీ మరోసారి మాట్లాడే ప్రయత్నం చేయడంతో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. కొద్ది సేపటికే స్థానిక శంకరంపేట పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు మృతురాలి బంధువులు.
అనుమానంః
భార్య సఖ్యతగా ఉండకపోవడంతో అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని పున్నమి లాడ్జిలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ముదావత్ శంకర్… అదే జిల్లా శంకర్ పల్లి కి చెందిన శిరీష తో ఫిబ్రవరి లో వివాహం జరిగింది. కొద్దిరోజులుగా వారిద్దరూ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ లో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులకు కూలీలుగా వచ్చారు. వివాహం అయినప్పటి నుండి శిరీష తన భర్తతో సఖ్యతగా ఉండకపోవడంతో అనుమానం పెంచుకున్న ఆమె భర్త శంకర్ ఆమెను నల్లగొండకు తీసుకువచ్చి లాడ్జిలో గదిఅద్దెకు తీసుకుని ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ శుక్రవారం సాయంత్రం వరకు గొడవపడినట్లు తెలుస్తోంది. గొడవ నేపథ్యంలోనే ఆమెను మెడను చున్నీతో బిగించి శంకర్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన అనంతరం భర్త పోలీసులకు లొంగి పోయినట్లు తెలుస్తోంది. ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించగా మృతదేహాన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్చరీకి తరలించారు.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!