రాజకీయ లబ్ధికే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కు ప్రాధాన్యత లేదని చెప్పడం బీజేపీ నాయకుల అవగాహన రాహిత్యం అన్నారు గుత్తా. రష్యా- ఉక్రెయిన్ ల యుద్ధం నేపథ్యంలో అక్కడి భారతీయులను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం. కాంగ్రెస్ పార్టీ…
తెలంగాణ సీఎం కేసీఆర్పై ఐదో తరగతి విద్యార్థిని ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన గుర్రం మేఘన (9) ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె తల్లిదండ్రులు డ్రాయింగ్ నేర్చుకోవడానికి మేఘనను ప్రోత్సహించారు. అయితే మేఘనకు సీఎం కేసీఆర్ కూడా ఇష్టం ఉండటంతో సుమారు 100కు పైగా చిత్రాలను వివిధ రంగులతో డ్రాయింగ్ వేసి అందరినీ అబ్బురపరుస్తోంది. కేవలం హరితహారం పథకం గురించే…
మహబూబ్నగర్, నల్గొండ పట్టణాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు (UDAలు) ప్రధాన నగరాలు, పట్టణాల చుట్టూ చక్కటి సమగ్ర మరియు ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిర్ధారించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. రోడ్డు నెట్వర్క్, నీటి సరఫరా, ఉపాధి అవకాశాలు మరియు శాటిలైట్…
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు భారీగా చేరారు. కానీ, ప్రభుత్వ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ కొరత తలనొప్పిగా మారింది. స్కూళ్ళల్లో మౌలిక వసతులు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్ధుల సంఖ్య బాగా ఎక్కువగా వుంది. కరోనా కారణంగా ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలు, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఎంతో మంది పేరెంట్స్,…
ఆగస్టు 15, జనవరి 26వ తేదీ వచ్చిందంటే చాలు మనలో చాలామందికి దేశభక్తి పొంగిపొరలుతుంది. సోషల్ మీడియాలో దేశభక్తి వెల్లువలా మెసేజ్ లు, స్టాటస్ ల రూపంలో కనిపిస్తుంది. కానీ నిత్యం తమలోని దేశభక్తిని చాటుకుంటూ తమ విలక్షణతను అందరికీ తెలియచేస్తున్నారు కొందరు దేశభక్తులు. ఇలాంటి అరుదైన ఘటన నిత్యం ఒక జిల్లాలో కనిపిస్తుంది. అది కూడా తెలంగాణలోనే వుండడం గమనార్హం. తెలంగాణకు మకుటాయమానంగా మారిన ఆ జిల్లా వేరే ఏదీ కాదు. పోరాటాల ఖిల్లా.. నల్లగొండ…
తెలంగాణలో త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండడంతో వ్యాపారులు, వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నల్గొండ జిల్లాలో కిక్కిరిసి పోయాయి రిజిస్ట్రేషన్ల ఆఫీసులు. గంటల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించకతప్పడం లేదు. మరో రెండురోజుల తర్వాత ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే స్లాట్ లు బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సాధారణ వినియోగదారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థలాలు కొనుగోలుచేయడం భారంగా మారుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఎలాంటి వృత్తిలో ఉన్నాం.. ఎలాంటి పనులు చేస్తున్నామన్న విచక్షణ కూడా లేకుండా పోయింది. పోలీసులు, టీచర్లు, డాక్టర్లు ఇలాంటి గౌరవమైన వృత్తిలో ఉండికూడా కొంతమంది నీచమైన పనులకు పాల్పడుతున్నారు. చివరికి దేవుడు నమ్మి చర్చికి వచ్చిన భక్తులను కూడా ఫాదర్ లు వదిలిపెట్టకపోవడం శోచనీయం. తాజాగా ఒక సిస్టర్ ని పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఒక ఫాదర్ మోసం చేసిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ…
తనకు చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని ఒక యువ రైతు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఆత్మహత్యకు చేసుకుంటానని మంత్రి కేటీఆర్ కు రైతు శ్రీను ట్వీట్ చేశాడు. తాను ఉన్నత చదువులు చదివినా, ఉద్యోగం లేకపోవడంతో తన భూమిలో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నానన్నాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండలలో తనకున్న 5 ఎకరాల భూమిని అధికారులు పల్లె వనం పేరుతో బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించారని రైతు అంటున్నాడు. తన భూమికి తనకివ్వాలని…
ఆ ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నారా? పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారా? ఎమ్మెల్యే ఒక అధికారి పేరును ప్రతిపాదిస్తే.. ముఖ్యమంత్రి మరో ఆఫీసర్ను నియమిస్తామని చెప్పారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఆయనపై సీఎం ఎందుకు గుర్రుగా ఉన్నారు? టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? నల్లగొండపై సీఎం సమీక్షలో ఆసక్తికర అంశాలుఇటీవల నల్లగొండ జిల్లాలో పర్యటించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ తండ్రి చనిపోవడంతో పరామర్శకు వెళ్లారు ముఖ్యమంత్రి. ఈ పర్యటన సందర్భంగా నల్గొండ…
వ్యాపారం కోసం నానా తంటాలు పడాలి. మొన్నటికి మొన్న చెన్నైలో బిర్యానీ కొంటే టమోటాలు ఫ్రీగా ఇచ్చాడో వ్యాపారి. తాజాగా హైదరాబాద్ లో పర్యావరణ పరిరక్షణ, వ్యాపారం పెంచుకునేందుకు వినూత్నమయిన ఆఫర్ పెట్టాడో వ్యాపారి. న్యూ ఇయర్ సందర్భంగా మటన్ ప్రియులకు కొత్త ఆఫర్ ప్రకటించాడు ఓ మటన్ వ్యాపారి. ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు వినూత్నంగా టిఫిన్ బాక్స్లలో మటన్ పెట్టి అమ్ముతున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా నల్గొండ జిల్లా చండూరులో భూతరాజు శ్రీకాంత్ అనే వ్యాపారి…