KTR:ఇవాళ సాగర్లో పర్యటించనున్న కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కేటీఆర్ నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్ వెల్కు పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఉదయం 9.45 గంటలకు పెద్దవూర మండలం సుంకిశాలకు చేరుకుంటారు. హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ఇన్టెక్ వెల్ పంపింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొంటారు.
Also Read
- SIR Phase-3 : దేశవ్యాప్తంగా 'SIR ఫేజ్-3' షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ఉదయం 10.45 గంటలకు నందికొండ మున్సిపాలిటీకి చేరుకుని బుద్ధావనం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంభందించిన రూ.56 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం హైదరాబాద్ బయలుదేరుతారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో అభివృద్ధి ప్రణాళిక చకచకా ముందుకు సాగుతున్నది. ఉప ఎన్నికల సమయంలో సాగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కీలకమైన నెల్లికల్లు లిఫ్టుతో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీల అభివృద్ధి, డిగ్రీ కళాశాల ఏర్పాటు, కాల్వల వెంట బ్రిడ్జిల నిర్మాణం, అన్ని గ్రామాలకు ప్రత్యేక నిధుల కేటాయింపు ఇలా అనేక కార్యక్రమాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దాంతో అంశాల వారీగా పరిపాలన అనుమతులు ఇస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే నెల్లికల్లు లిఫ్ట్ పనులు శరవేగంగా జరుగుతుండగా మున్సిపల్ కేంద్రాల్లో పలు పనులకు శనివారం జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పునాదిరాయి వేయనున్నారు. జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించి సుమారు రూ.56కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రులు శంకస్థాపన చేయనున్నారు. ఉప ఎన్నికల తర్వాత కేటీఆర్ తొలిసారి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వస్తుండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Gyanvapi mosque survey: జ్ఞానవాపీ మసీదు సర్వే… వారణాసిలో భద్రత కట్టుదిట్టం
తాజావార్తలు
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!