ఆ ఎంపీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?
ఉత్తమ్ కుమార్రెడ్డి. ప్రస్తుతం నల్లగొండ ఎంపీ. గతంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే. పీసీసీ మాజీ చీఫ్. ఎంపీగా కిక్కు ఇవ్వలేదో.. అసెంబ్లీనే ముద్దు అనుకుంటున్నారో కానీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు. హుజూర్నగర్ను విడిచిపెట్టేది లేదని.. ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ఇటీవలే ఓపెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఉత్తమ్. నల్లగొండ ఎంపీగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ ఏం చేస్తారు అనేదానిపై పార్టీ కేడర్లో ఇన్నాళ్లూ కొంత సస్పెన్స్ ఉండేది. ఆ ఉత్కంఠకు ఆయన తెరదించేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హుజూర్నగర్తోపాటు కోదాడ కూడా ఉత్తమ్ అడ్డానే. వచ్చే ఎన్నికలకు హుజూర్నగర్ను ఎంచుకోవడంతో కోదాడలో ఆయన అనుచరులు నిరాశ చెందినట్టు చెబుతున్నారు.
కోదాడలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ ప్రకటన రుచించలేదట. 2018 ఎన్నికల సమయంలోనే హుజూర్నగర్ కాకుండా కోదాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. ఆయన హుజూర్నగర్ను ఎంచుకు భార్య పద్మావతిని కోదాడ బరిలో నిలిపారు. పద్మావతి టీఆర్ఎస్ అభ్యర్తి మల్లయ్య యాదవ్ చేతిలో ఓడిపోయారు. తమ మాటలను ఉత్తమ్ పరిగణనలోకి తీసుకోలేదని సందర్భం చిక్కినప్పుడల్లా కోదాడ కాంగ్రెస్ నేతలు చర్చకు పెడుతూనే ఉన్నారట. కొందరైతే ఇప్పటికీ తమ నాయకుడు ఎదురైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటారని టాక్.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
ఉత్తమ్ భార్య పద్మావతి కోదాడలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నప్పటికీ.. కెప్టెన్ పోటీలో ఉంటే కలిగే లెక్క వేరని కేడర్ అభిప్రాయంగా ఉంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పాత నియోజకవర్గమైన కోదాడకు ఎప్పటికైనా తిరిగి వస్తారని ఆశిస్తూ వచ్చారట కార్యకర్తలు. ఇదే సమయంలో హుజూర్నగర్లోనే పోటీ చేస్తానని ఉత్తమ్ తేల్చి చెప్పేయడంతో కోదాడ పరిస్థితి ఏంటా అని మల్లగుల్లాలు పడుతున్నారట ఆయన అభిమానులు.. పార్టీ కార్యకర్తలు. వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచి మరోసారి పద్మావతే బరిలో ఉంటారని అనుకుంటున్నారు.
ఇదే సమయంలో కోదాడ కాంగ్రెస్లో మరో చర్చ మొదలైంది. ఉత్తమ్ కుటుంబానికి కాకుండా కొత్త వారికి టికెట్ ఇప్పించేలా పార్టీపై ఒత్తిడి చేయాలని కొందరు ఆలోచిస్తున్నారట. అయితే కాంగ్రెస్లో ఉత్తమ్ను ఎదిరించి.. ఆయన్ని కాదని పార్టీ టికెట్ సాధించడం అయ్యేపనేనా అనే వాదన ఉంది. మొత్తంగా పీసీసీ మాజీ చీఫ్ ప్రకటన కోదాడ కాంగ్రెస్లో పెద్ద అలజడే తీసుకొచ్చింది. మరి.. గుర్రుగా ఉన్న కేడర్ను కెప్టెన్ ఎలా బుజ్జగిస్తారో చూడాలి.
- Tags
- MLA
- Nalgonda
- tcongress
- Uttam kumar
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
-
Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!