దసరా రోజున సంగారెడ్డిలో భారీ బహిరంగ సభలో సంచలన ప్రకటన చేయనున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖలు చేశారు.కాగా.. తాను కాంగ్రెస్ వీడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని ఖండించారు. తాను పార్టీని వీడటం లేదని, పని జరగదని తేల్చేశారు. అంతేకాదు, తాను టీఆర్ఎస్ లో చేరుతానని జరుగుతున్న ప్రచారం ఎన్నటికీ నిజం కాబోదని…
దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు తెలంగాణ వైపే ఉంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ ప్రధాన నేతలు హైదరాబాద్ లో మకాం వేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విమర్శలను పెంచాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటానని వెల్లడించారు. బీజేపీ దేవుళ్ల పేరుతో…
తెలంగాణలో రాజకీయాలు ప్రజలను రక్షించేలా లేవని.. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రజలను ఎలా బతికించాలనేదే లేదని విమర్శించారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడుకోవడం ఎలా అనేది లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ మోదీని, మోదీ కేసీఆర్ ని తిట్టుకున్నట్లు నటించారని ఆరోపించారు. ఏపీలో బీజేపీ కులాలకు ప్రయారిటీ ఇస్తోందని.. తెలంగాణలో మతపరమైన అంశాలను రెచ్చగొట్టే…
నేను అప్పుడు ఇప్పుడు సమైక్యవాదినే అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కేసీఆర్ని బట్టలు ఇప్పి కొడుతానన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ టీఆర్ఎస్ ప్రభుత్వ క్యాబినెట్ లో మంత్రే కదా.. ఉద్యమంలో కేసీఆర్ ఊరికించి కొడుతానన్న ఎర్రబెల్లి దయాకర రావు ఇప్పుడు మీ ప్రభుత్వ క్యాబినెట్ లొనే ఉన్నాడు కదా.. మంత్రి పువ్వడా అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నికర్సైనా స్వమైక్యవాదులే కదా.. ఉద్యమ సమయంలో టీఆరెస్…
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వం విప్ బాల్క సుమన్పై నిప్పులు చెరిగారు. ఇటీవల బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. రాహుల్ గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా..తప్పు లేదు నీకు అంటూ బాల్క సుమన్పై విమర్శలు చేశారు. బాల్క సుమన్ మీడియా ముందుకు వచ్చేటప్పుడు… కేసీఆర్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పంపితే మంచిదని, కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చి రాజకీయంగా మేము లాభం పొందినమా..? అని అన్నారు. లాభం పొందింది మీరు రిజర్వేష్లు రాలేదు.. రుణమాఫీ…
టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన తెలంగాణ ఉద్యమం వెనక ఉన్నది కాంగ్రెస్ కాదా..? . ఉద్యమం మొదలు పెట్టిన ఇన్నారెడ్డి ఎటు పోయారు..? అని ఆయన ప్రశ్నించారు. బాల్క సుమన్కి ఏం తెలుసు…చిన్న పిల్లగాడు.. తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు.. అంటూ వ్యాఖ్యానించారు. గల్లీలో గోళీలు ఆడుకునే సుమన్.. ఎంపీ.. అయ్యాడు…ఎమ్మెల్యే అయ్యాడు.. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఇన్నరెడ్డి… కనీసం కార్పొరేటర్…
తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగిందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. విభజన లో ప్రధాన పాత్ర పోషించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది. విద్యార్ధుల ప్రాణాలు కోల్పోవద్దు అని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేము. రాహుల్ గాంధీ నీ ఉస్మానియా యూనివర్సిటీ కి తీసుకువస్తాం. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీ వెళ్తారు. యూనివర్సిటీ సందర్శించి.. విద్యార్థులతో మాట్లాడతారు. యూనివర్సిటీ సమస్యలు..ఉద్యోగాల భర్తీ మీద మాట్లాడతారు. సమస్యలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువచ్చే…
భూదాన్ ఉద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎంపీ ఏఐసీసీ, పంచాయితీ రాజ్ సంఘం చైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలో వర్ధా వరకు 600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ పాదయాత్ర మెదక్ జిల్లాలోని మాసాయిపేట నుండి చేగుంట వరకు సాగింది. ఈ సర్వోదయ సంకల్ప పాదయాత్రలో మీనాక్షి నటరాజన్తో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు…
తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ల సమావేశం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వమే కావాలంటూ సమావేశమైనట్లు ఇటీవల స్పష్టత ఇచ్చారు. అయితే నేడు మరోసారి టీకాంగ్రెస్ సీనియర్లు సమావేశం కానున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి ఫోన్ చేసి సమావేశం నిర్వహించవద్దన్నారు. అంతేకాకుండా ఏమైనా సమస్య ఉంటే.. నేరుగా సోనియా, రాహుల్ ల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి మేలు…
కాంగ్రెస్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అడుగడుగునా అడ్డంకులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అయితే సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు చేదు అనుభవం ఎదురైందని, తనను అవమానించేవాడు కాంగ్రెస్లో ఎవడూ లేడని అన్నారు. అంతేకాకుండా మెదక్ జిల్లాకు వెళితే పీసీసీ సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ పద్ధతి తనకు నచ్చడం లేదని, ఈ…