Jaggareddy: బీజేపీకి జ్ఞానాన్ని ప్రసాదించాలని భాగ్యలక్ష్మీ అమ్మవారిని కోరుతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు తెలంగాణ వైపే ఉంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ ప్రధాన నేతలు హైదరాబాద్ లో మకాం వేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విమర్శలను పెంచాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటానని వెల్లడించారు. బీజేపీ దేవుళ్ల పేరుతో మీద రాజకీయాలు చేస్తోందని.. తెలంగాణ ప్రజలను అయోమయంలో పడేలా చేస్తుందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు అవకాశం ఇచ్చారని.. అయితే బీజేపీ మాత్రం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, మంచి పాలన అందించడం లేదని విమర్శించారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
Read Also:BJP National Executive Meeting: కావాలనే రెచ్చగొడుతున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్
నేను రాజకీయాలకు సంబంధం లేకుండా భాగ్యలక్ష్మీ అమ్మవారిని ప్రతీ దీపావళికి వెళ్లి దర్శించుకుంటానని జగ్గారెడ్డి తెలిపారు. కానీ రేపు మాత్రం ప్రజలకు మంచి పాలన అందించేలా బీజేపీకి జ్ఞానాన్ని అందిచాలని, బుద్ధిని ప్రసాదించాలని కోరేందుకు వెళ్తున్నానని అన్నారు. నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, అనిల్ కుమార్ యాదవ్ మరియు ఇతర నేతలు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని లేఖలో పత్రికా ప్రకటనలో వెల్లడించారు
మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ రోజు యోగీ అమ్మవారిని దర్శించుకుంటారని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల రద్దైంది. తాాజాగా ఈ రోజు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే హైదరాబాద్ పేరు మారుస్తాం అంటూ సంచలన ప్రకటన చేశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!