Jagga Reddy: గవర్నర్ మహిళా దర్బార్ వెనక బీజేపీ, మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయాలు ప్రజలను రక్షించేలా లేవని.. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రజలను ఎలా బతికించాలనేదే లేదని విమర్శించారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడుకోవడం ఎలా అనేది లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ మోదీని, మోదీ కేసీఆర్ ని తిట్టుకున్నట్లు నటించారని ఆరోపించారు.
ఏపీలో బీజేపీ కులాలకు ప్రయారిటీ ఇస్తోందని.. తెలంగాణలో మతపరమైన అంశాలను రెచ్చగొట్టే పనిలో పడ్డారని అన్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. గవర్నర్ మహిళా దర్బార్ వెనక బీజేపీ, ప్రధాని మోదీ ఉన్నారని.. బీజేపీ డైరెక్షన్ లోనే దర్బార్ పెట్టారని.. గవర్నర్ కు సమస్యలపై చర్యలు తీసుకోవడానికి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. గవర్నర్ వెళ్తే జిల్లా ఎస్పీ, కలెక్టర్లే రావడం లేదు.. ఆమె ఏం చర్యలు తీసుకుంటారని అన్నారు. గవర్నర్ పిలిస్తే డీజీపీ, సీఎస్ రారని ఆయన అన్నారు. మహిళలకు జరిగే అవమానం కన్నా గవర్నర్ కే ఎక్కువ అవమానం జరిగిందని అన్నారు.
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
గవర్నర్ పాలన వస్తే కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతుందని..గవర్నర్ కేంద్రం ఏం చెబితే అదే వింటారని.. గవర్నర్ పాలన కోరితే కాంగ్రెస్ ప్రమాదంలో పడ్డట్లే అని వ్యాఖ్యానించారు. కేంద్రం రాయబారం చేయాలంటే గవర్నర్ తో , రాజకీయం చేయాలనుకుంటే టీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ వ్యతిరేఖ ఓటు కాంగ్రెస్ కు పోవద్దని ఆలోచన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలతో అన్నీ తేలిపోతాయని అన్నారు. బీజేపీని టీఆర్ఎస్ వ్యతిరేఖిస్తే యూపీఏ అభ్యర్థికి ఓటేస్తారని.. ఒక వేళ తటస్థంగా ఉన్నా బీజేపీకి మేలు చేసిన వారే అవుతారని అన్నారు.
రాజా సింగ్, అజ్మీర్ దర్గాకు వెళ్లవద్దని హిందువులకు చెబుతున్నాడని.. దర్గా పుట్టి 700 ఏళ్లు అయిందని, రాజాసింగ్ పుట్టి 50 ఏళ్లు అయిందని అన్నారు. దర్గాలకు, పీర్లకు ముస్లింలు 50 శాతం పోతే, హిందువులు 50 శాతం పోతారని జగ్గారెడ్డి అన్నారు. రాజాసింగ్ మొదటి నుంచి మతాన్ని రెచ్చగొడుతున్నాడని.. సీట్లను పెంచుకునే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రాజాసింగ్ కు పిచ్చి పట్టిందని.. రెచ్చగొట్టి ఇంట్లో పడుకుంటాడని.. కొట్లాడి సచ్చిపోయేది యువకులే అని అన్నారు. రాజాసింగ్ కు దమ్ముంటే హిందువులు అజ్మీర్ దర్గాకు వెళ్లకుండా ఆపాలని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!